సాధారణంగా సంసారం అన్న తర్వాత భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు కోపాలు పెంచుకున్నప్పటికీ కొద్దిరోజులకు ఆ కోపం కాస్తా తగ్గిపోయి భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కానీ మరి కొందరు అదే కారణం చూపెడుతూ చీటికీ మాటికీ గొడవపడుతూ బంధం నుంచి విడిపోవడం లేదా ఆత్మహత్యలకు పాల్పడటం లేదంటే హత్యలు చేయడం కూడా చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్లో ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపతిపురంకు చెందిన అప్పారావుకు, అదే మండలానికి చెందిన దేవితో 12 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. ఈ దంపతులకు పదేళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య పరస్పరం గొడవలు తలెత్తడంతో ఒకే ఇంట్లోనే ఉంటున్నప్పటికీ వీరిద్దరు వేర్వేరు గదుల్లో ఉండేవారు. ఇలా వేరువేరుగా ఉంటున్న భార్య భర్తల మధ్య గొడవలు తారా స్థాయికి చేరడం వల్ల వీరి గొడవ సమీప పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది.
ఈ క్రమంలోనే పోలీసులు వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే ఈ విషయం బయట తెలియడంతో అప్పారావును ఉద్యోగం నుంచి తొలగించగా అతను ఇంట్లోనే ఉంటున్నాడు. కేవలం తన భార్య కారణంగానే తనకు ఉద్యోగం పోయిందని వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ విధంగా ఒకరోజు వీరిద్దరి మధ్య గొడవ చోటుచేసుకోవడంతో ఆ రోజు రాత్రి దేవి తన భర్తను గొడ్డలితో నరికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని తన భార్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తల్లి ఇంటిని వదిలి వెళ్ళిపోగా తండ్రి మరణించడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారిపోయారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…