సాధారణంగా సంసారం అన్న తర్వాత భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు కోపాలు పెంచుకున్నప్పటికీ కొద్దిరోజులకు ఆ కోపం కాస్తా తగ్గిపోయి భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కానీ మరి కొందరు అదే కారణం చూపెడుతూ చీటికీ మాటికీ గొడవపడుతూ బంధం నుంచి విడిపోవడం లేదా ఆత్మహత్యలకు పాల్పడటం లేదంటే హత్యలు చేయడం కూడా చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్లో ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపతిపురంకు చెందిన అప్పారావుకు, అదే మండలానికి చెందిన దేవితో 12 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. ఈ దంపతులకు పదేళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య పరస్పరం గొడవలు తలెత్తడంతో ఒకే ఇంట్లోనే ఉంటున్నప్పటికీ వీరిద్దరు వేర్వేరు గదుల్లో ఉండేవారు. ఇలా వేరువేరుగా ఉంటున్న భార్య భర్తల మధ్య గొడవలు తారా స్థాయికి చేరడం వల్ల వీరి గొడవ సమీప పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది.
ఈ క్రమంలోనే పోలీసులు వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే ఈ విషయం బయట తెలియడంతో అప్పారావును ఉద్యోగం నుంచి తొలగించగా అతను ఇంట్లోనే ఉంటున్నాడు. కేవలం తన భార్య కారణంగానే తనకు ఉద్యోగం పోయిందని వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ విధంగా ఒకరోజు వీరిద్దరి మధ్య గొడవ చోటుచేసుకోవడంతో ఆ రోజు రాత్రి దేవి తన భర్తను గొడ్డలితో నరికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని తన భార్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తల్లి ఇంటిని వదిలి వెళ్ళిపోగా తండ్రి మరణించడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారిపోయారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…