సాధారణంగా బెండ కాయలు గ్రీన్ కలర్ లో ఉంటాయి. కానీ మనకు మార్కెట్లో ప్రస్తుతం ఎరుపు రంగులో ఉండే బెండకాయలు కూడా లభిస్తున్నాయి. వీటిని చాలా మంది రైతులు ప్రస్తుతం సాగు చేస్తున్నారు. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అందుకనే వీటిని తినేందుకు జనాలు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజల అభిరుచులకు అనుగుణంగా రైతులు కూడా వీటిని పండించడానికే మొగ్గు చూపిస్తున్నారు.
మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లా ఖాజూరి కలన్ అనే ప్రాంతానికి చెందిన మిస్రిలాల్ రాజ్పూత్ ఎరుపు రంగు బెండకాయలను సాగు చేస్తున్నాడు. వారణాసిలో ఉన్న అగ్రికల్చరల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ నుంచి ఎరుపు రంగు బెండ విత్తనాలను 1 కిలో తెచ్చానని వాటిని జూలై మొదటి వారంలో నాటగా 40 రోజుల్లో పెరగడం ప్రారంభించాయని తెలిపాడు.
ఎరుపు రంగు బెండకాయలను పండించేందుకు ఎలాంటి కృత్రిమ ఎరువులు, రసాయనాలను వాడలేదని, పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో సాగు చేశానని తెలిపాడు. ఈ క్రమంలో పంట బాగా వచ్చిందని అన్నాడు. ఒక ఎకరాల స్థలంలో కనీసం 40-50 క్వింటాళ్ల నుంచి గరిష్టంగా 70-80 క్వింటాళ్ల వరకు ఎరుపు రంగు బెండకాయలను పండించవచ్చని తెలిపాడు.
మార్కెట్లో ప్రస్తుతం ఎరుపు రంగు బెండకాయలను మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే సాధారణ బెండ కాయలకన్నా ఎరుపు రంగు బెండకాయల రేటు 5-7 రెట్లు ఎక్కువగా ఉంది. ఎరుపు రంగు బెండకాయలు కిలోకు రూ.700 నుంచి రూ.1200 వరకు ధర పలుకుతున్నట్లు ఆ రైతు తెలిపాడు. వీటి వల్ల లాభాలు బాగా వస్తున్నట్లు వివరించాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…