మద్యం అనేది ఎంతటి పని అయినా చేయిస్తుంది. మద్యం మత్తులో ఉన్నవారు ఒక్కోసారి ఒళ్లు జలదరించే పనులు చేస్తుంటారు. తీరా తెలివి వచ్చాక వారు చేసిన పని తలచుకుని వారికే భయం కలుగుతుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి అక్కడ చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
చత్తీస్గడ్లోని కోర్బాలో ఉన్న ఇందిరానగర్ అనే ప్రాంతంలో రాజు జంగ్డె, హితేంద్ర ఆనంద్ అనే ఇద్దరు యువకులు నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి వారు పీకలదాకా మద్యం సేవించి గ్రామంలో చోట డ్రెయినేజీ దగ్గర ఆగారు. అక్కడ మంటల్లో సగం వరకు కాలిపోయిన పామును వారు చూశారు. అయితే అది ఇంకా బ్రతికే ఉంది.
ఈ క్రమంలో వారు ఆ పామును తీసుకుని కరకరా నమిలి తినడం మొదలు పెట్టారు. ఇద్దరూ తల భాగాన్ని కొరికి తిన్నాక మిగిలిన భాగాన్ని నమిలి మింగారు. వెంటనే ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఇంటికి వెళ్లగానే ఇద్దరూ కళ్లు తిరిగి, వాంతులు చేసుకుంటూ పడిపోయారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు.
హాస్పిటల్లో వైద్యులు చికిత్స చేసి వారిని రక్షించారు. కొంత ఆలస్యం అయి ఉంటే వారి ప్రాణాలు పోయి ఉండేవని, ప్రస్తుతం ఆ ఇద్దరు యువకులు క్షేమంగానే ఉన్నారని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
అయితే పామును ఎందుకు కొరికి తిన్నారని ప్రశ్నించగా.. తమ గ్రామంలో పాములు బాగా తిరుగుతున్నాయని, అందుకే కోపం వచ్చి కొరికేశామని, లేకపోతే అది ఎవరినైనా కాటు వేస్తుందని భావించామని, అందుకనే ఆ పనిచేశామని చెప్పారు. దీంతో వారి సమాధానం విన్నవారు షాకయ్యారు. అయితే నిజానికి అది అత్యంత విష పూరితమైన పాము అని, అది కాటు వేస్తే 15 నిమిషాల్లోనే చనిపోతారని, అలాంటిది ఆ ఇద్దరూ బతికారంటే వారికి భూమిపై ఇంకా నూకలు ఉన్నందు వల్లేనని వైద్యులు తెలిపారు.
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…