మద్యం అనేది ఎంతటి పని అయినా చేయిస్తుంది. మద్యం మత్తులో ఉన్నవారు ఒక్కోసారి ఒళ్లు జలదరించే పనులు చేస్తుంటారు. తీరా తెలివి వచ్చాక వారు చేసిన పని తలచుకుని వారికే భయం కలుగుతుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి అక్కడ చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
చత్తీస్గడ్లోని కోర్బాలో ఉన్న ఇందిరానగర్ అనే ప్రాంతంలో రాజు జంగ్డె, హితేంద్ర ఆనంద్ అనే ఇద్దరు యువకులు నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి వారు పీకలదాకా మద్యం సేవించి గ్రామంలో చోట డ్రెయినేజీ దగ్గర ఆగారు. అక్కడ మంటల్లో సగం వరకు కాలిపోయిన పామును వారు చూశారు. అయితే అది ఇంకా బ్రతికే ఉంది.
ఈ క్రమంలో వారు ఆ పామును తీసుకుని కరకరా నమిలి తినడం మొదలు పెట్టారు. ఇద్దరూ తల భాగాన్ని కొరికి తిన్నాక మిగిలిన భాగాన్ని నమిలి మింగారు. వెంటనే ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఇంటికి వెళ్లగానే ఇద్దరూ కళ్లు తిరిగి, వాంతులు చేసుకుంటూ పడిపోయారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు.
హాస్పిటల్లో వైద్యులు చికిత్స చేసి వారిని రక్షించారు. కొంత ఆలస్యం అయి ఉంటే వారి ప్రాణాలు పోయి ఉండేవని, ప్రస్తుతం ఆ ఇద్దరు యువకులు క్షేమంగానే ఉన్నారని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
అయితే పామును ఎందుకు కొరికి తిన్నారని ప్రశ్నించగా.. తమ గ్రామంలో పాములు బాగా తిరుగుతున్నాయని, అందుకే కోపం వచ్చి కొరికేశామని, లేకపోతే అది ఎవరినైనా కాటు వేస్తుందని భావించామని, అందుకనే ఆ పనిచేశామని చెప్పారు. దీంతో వారి సమాధానం విన్నవారు షాకయ్యారు. అయితే నిజానికి అది అత్యంత విష పూరితమైన పాము అని, అది కాటు వేస్తే 15 నిమిషాల్లోనే చనిపోతారని, అలాంటిది ఆ ఇద్దరూ బతికారంటే వారికి భూమిపై ఇంకా నూకలు ఉన్నందు వల్లేనని వైద్యులు తెలిపారు.
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…