మీరు పీఎఫ్ ఖాతాదారులా..? మీకు పీఎఫ్ ఖాతా ఉందా.? అయితే మీకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతాదారులకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి కాను వచ్చే వడ్డీ డబ్బులను EPFO కస్టమర్లకు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ క్రమంలోనే ఖాతాదారులకు శుభవార్తని తెలుపుతూ EPFO వచ్చే దీపావళి పండుగలో ఖాతాదారుల వడ్డీ డబ్బులను వారి ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ క్రమంలోనే EPFO సెంట్రల్ బోర్డ్ వడ్డీరేట్లకు కూడా ఆమోదముద్ర తెలియజేయడంతో కేవలం ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభిస్తే వెంటనే వడ్డీ డబ్బులు ఖాతాదారుల అకౌంట్లో జమ కానున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం 2020 – 21 సంవత్సరానికి గాను పీఎఫ్ వడ్డీరేటును 8.5 శాతానికి తగ్గించింది.
తగ్గిన వడ్డీ రేట్లకు అనుగుణంగానే డబ్బులు ఖాతాదారుల అకౌంట్లో జమ కానున్నాయి. అయితే ఈ వడ్డీ రేట్లు 2018 – 19 వ సంవత్సరంలో 8.65 శాతం ఉండగా 2017 -18 లో 8.55 శాతం ఉంది. ఇకపోతే 2016 – 17 వడ్డీ రేట్లు 8.65 శాతం ఉండటం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ 2020 -21 సంవత్సరానికి గాను రావాల్సిన వడ్డీ డబ్బులు త్వరలోనే లబ్ధిదారులకు అందనున్నాయని తెలియడంతో ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…