ఆ యువతిని ఆమె తల్లిదండ్రులు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారు. ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. కానీ ఆమె మాత్రం ప్రేమ అంటూ ధ్యాసను మరల్చింది. తల్లిదండ్రులు మందలించే సరికి ఏకంగా వారికి చెప్పకుండా తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. ఆ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఎంతో అవమానంగా ఫీలయ్యారు. విషం తాగి తనువులు చాలించారు. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో ఉన్న కున్నతూర్ ప్రాంతం పొలాయంపాలయంకు చెందిన ఆర్.పొన్ను స్వామి (65) బోర్వెల్ వ్యాపారం చేస్తున్నాడు. అతని భార్య పి.సుమతి (55) గృహిణి. కుమార్తె జనని (22) ఫిజియోథెరపీ విద్యను అభ్యసిస్తోంది. మరికొంత కాలం అయితే చదువు పూర్తి చేసుకుని చక్కగా ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు అండగా నిలబడి ఉండేది. కానీ ప్రేమ ఆమె ధ్యాసను మరల్చింది.
అదే ప్రాంతానికి చెందిన సంపత్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించడం మొదలు పెట్టింది. వీరి విషయం పొన్నుస్వామికి తెలిసింది. దీంతో ఆ దంపతులు జనని ని మందలించారు. చక్కగా చదువుకోవాలని చెప్పి హితవు పలికారు. కానీ ఆమె వినిపించుకోలేదు.
ఇటీవలే ఒక రోజు ఆమె కోయంబత్తూరులోని కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఆ రోజు ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు కంగారు పడ్డారు. అయితే ఆమె సంపత్ను పెళ్లి చేసుకుంది. తరువాత ఫొటోలను వాట్సాప్లో తన తల్లిదండ్రులకు పంపించింది.
దీంతో అవమానంగా భావించిన పొన్ను స్వామి, సుమతిలు శనివారం రాత్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఇరుగు పొరుగు వారు వారిని గమనించి హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…