ఆ యువతిని ఆమె తల్లిదండ్రులు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారు. ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. కానీ ఆమె మాత్రం ప్రేమ అంటూ ధ్యాసను మరల్చింది. తల్లిదండ్రులు మందలించే సరికి ఏకంగా వారికి చెప్పకుండా తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. ఆ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఎంతో అవమానంగా ఫీలయ్యారు. విషం తాగి తనువులు చాలించారు. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో ఉన్న కున్నతూర్ ప్రాంతం పొలాయంపాలయంకు చెందిన ఆర్.పొన్ను స్వామి (65) బోర్వెల్ వ్యాపారం చేస్తున్నాడు. అతని భార్య పి.సుమతి (55) గృహిణి. కుమార్తె జనని (22) ఫిజియోథెరపీ విద్యను అభ్యసిస్తోంది. మరికొంత కాలం అయితే చదువు పూర్తి చేసుకుని చక్కగా ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు అండగా నిలబడి ఉండేది. కానీ ప్రేమ ఆమె ధ్యాసను మరల్చింది.
అదే ప్రాంతానికి చెందిన సంపత్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించడం మొదలు పెట్టింది. వీరి విషయం పొన్నుస్వామికి తెలిసింది. దీంతో ఆ దంపతులు జనని ని మందలించారు. చక్కగా చదువుకోవాలని చెప్పి హితవు పలికారు. కానీ ఆమె వినిపించుకోలేదు.
ఇటీవలే ఒక రోజు ఆమె కోయంబత్తూరులోని కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఆ రోజు ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు కంగారు పడ్డారు. అయితే ఆమె సంపత్ను పెళ్లి చేసుకుంది. తరువాత ఫొటోలను వాట్సాప్లో తన తల్లిదండ్రులకు పంపించింది.
దీంతో అవమానంగా భావించిన పొన్ను స్వామి, సుమతిలు శనివారం రాత్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఇరుగు పొరుగు వారు వారిని గమనించి హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…