ఆంబులెన్స్లు అనేవి అత్యవసర వాహనాలు. ఎవరికైనా ప్రాణాపాయ పరిస్థితి ఉంటే వారిని వెంటనే మెరుగైన చికిత్స కోసం ఆంబులెన్స్లలో హాస్పిటల్స్ కు తరలిస్తుంటారు. అందువల్ల ఆంబులెన్స్ లకు ఎవరైనా సరే దారివ్వాల్సిందే. కానీ ఈ విషయంపై కూడా అవగాహన లేని, కనీస జ్ఞానం లేని ఓ వ్యక్తి ఆంబులెన్స్కు దారివ్వలేదు. అయితే చివరకు అతను కటకటాల పాలయ్యాడు.
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా తొక్కొట్టు, పంప్వెల్ మధ్య జాతీయ రహదారి-66పై తాజాగా ఓ ఆంబులెన్స్ ప్రయాణించింది. దాని ముందట ఓ వ్యక్తి కారులో ప్రయాణించాడు. అయితే అతను ఆంబులెన్స్కు దారివ్వలేదు. పదే పదే ఆంబులెన్స్ కు అడ్డుగా వచ్చాడు. అదే సమయంలో కొందరు ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
అయితే ఆ వీడియో ఆధారంగా మంగళూరు పోలీసులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతన్ని చరణ్ (31) అనే వ్యక్తిగా గుర్తించారు. దీంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 279, మోటార్ వెహికిల్ యాక్ట్ 1988 సెక్షన్ 194(ఇ) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే అతను కారు ఎందుకు అలా డ్రైవ్ చేశాడు, మద్యం ఏమైనా సేవించాడా ? అన్న వివరాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా.. సోషల్ మీడియా వల్ల ఒక వ్యక్తి అలా పట్టుబడడం అభినందించదగిన విషయం..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…