ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలో ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. దీంతో ఈ విషయం అక్కడ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. అక్కడి చందౌలి జిల్లాలో ఆవుకు రెండు తలల దూడ జన్మించింది. దానికి రెండు నోళ్లు, రెండు చెవులు, నాలుగు కళ్లు ఉన్నాయి. అరవింద్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన ఆవుకు ఆ దూడ జన్మించింది. అయితే ప్రస్తుతం ఆవు, దూడ రెండూ ఆరోగ్యంగానే ఉన్నాయి.
ఈ సందర్భంగ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ఉదయం ఆ దూడ జన్మించిందని తెలిపాడు. దాన్ని చూసి తమ కుటుంబమంతా ఒక్కసారిగా షాక్కు గురైందన్నాడు. అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఊరంతా వ్యాపించింది. దీంతో దూడను చూసేందుకు గ్రామస్థులు తండోప తండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు. దూడ అలా జన్మించడంతో దాన్ని దైవానికి ప్రతి రూపమని భావిస్తున్నారు. దానికి పూజలు చేస్తున్నారు.
అయితే వెటర్నరీ వైద్యులు మాత్రం ఇలా అత్యంత అరుదుగా జరుగుతుంటుందన్నారు. దీనిపై చందౌలి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ సత్య ప్రకాష్ మాట్లాడుతూ ఆవు గర్భంలో అసాధారణ రీతిలో కణాలు పెరగడం వల్ల ఇలా జరుగుతుందని, అంతే కానీ దూడ ఏమీ దైవం కాదని కొట్టి పారేశారు. అయినప్పటికీ స్థానికులు మాత్రం ఆ దూడను చూసేందుకు ఆసక్తి చూపిస్తుండడం విశేషం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…