ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలో ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. దీంతో ఈ విషయం అక్కడ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. అక్కడి చందౌలి జిల్లాలో ఆవుకు రెండు తలల దూడ జన్మించింది. దానికి రెండు నోళ్లు, రెండు చెవులు, నాలుగు కళ్లు ఉన్నాయి. అరవింద్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన ఆవుకు ఆ దూడ జన్మించింది. అయితే ప్రస్తుతం ఆవు, దూడ రెండూ ఆరోగ్యంగానే ఉన్నాయి.
ఈ సందర్భంగ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ఉదయం ఆ దూడ జన్మించిందని తెలిపాడు. దాన్ని చూసి తమ కుటుంబమంతా ఒక్కసారిగా షాక్కు గురైందన్నాడు. అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఊరంతా వ్యాపించింది. దీంతో దూడను చూసేందుకు గ్రామస్థులు తండోప తండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు. దూడ అలా జన్మించడంతో దాన్ని దైవానికి ప్రతి రూపమని భావిస్తున్నారు. దానికి పూజలు చేస్తున్నారు.
అయితే వెటర్నరీ వైద్యులు మాత్రం ఇలా అత్యంత అరుదుగా జరుగుతుంటుందన్నారు. దీనిపై చందౌలి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ సత్య ప్రకాష్ మాట్లాడుతూ ఆవు గర్భంలో అసాధారణ రీతిలో కణాలు పెరగడం వల్ల ఇలా జరుగుతుందని, అంతే కానీ దూడ ఏమీ దైవం కాదని కొట్టి పారేశారు. అయినప్పటికీ స్థానికులు మాత్రం ఆ దూడను చూసేందుకు ఆసక్తి చూపిస్తుండడం విశేషం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…