ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. తినడానికి రుచి మాత్రమే కాకుండా తయారు చేసుకోవడానికి ఎంతో సులభం. ముఖ్యంగా బ్యాచిలర్స్ కు ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్ ఫాస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. మరి ఎంతో సులువైన రుచికరమైన ఈ ప్రైడ్ రైస్ ఏవిధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
*ఒక కప్ప రైస్
*కోడిగుడ్లు 3
*కారం అర టీ
*ఉప్పు తగినంత
*పసుపు చిటికెడు
*గరంమసాలా అర టీ స్పూన్
*ఉల్లిపాయ ముక్కలు అర కప్పు
*కరివేపాకు రెమ్మ
*రెండు పచ్చిమిర్చి ముక్కలు
*నూనె
ముందుగా ఒక కప్పు రైస్ తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ ఉంచి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి కలియబెట్టాలి. రెండు నిమిషాలు తర్వాత తగినంత ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కోడిగుడ్లను పగలగొట్టుకుని అందులో వేయాలి.కోడిగుడ్ల మిశ్రమాన్ని కాసేపు కదలకుండా తక్కువ మంటలో మగ్గించాలి. ఇందులోకి అర టీ స్పూన్ కారం వేసి నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని కలపాలి.ఎక్కువసార్లు కలపడం వల్ల కోడుగుడ్డు చిన్న ముక్కలుగా విడిపోవడంతో తినడానికి రుచిగా అనిపించదు. కనుక ఎక్కువ సార్లు కలియ పెట్టకుండా తక్కువ మంటలో బాగా ఫ్రై చేసుకోవాలి.ఎగ్ మొత్తం ఫ్రీ అయిన తర్వాత అందులోకి ముందుగా తయారు చేసుకున్న అన్నం కలుపుకోవాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కలుపుకుని కాస్త కొత్తిమీర తురుము చల్లుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైనట్లే.వేడి వేడిగా ఉన్న ఈ రైస్ లోకి కొద్దిగా ఉల్లిపాయముక్కలు నిమ్మకాయతో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…