ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. తినడానికి రుచి మాత్రమే కాకుండా తయారు చేసుకోవడానికి ఎంతో సులభం. ముఖ్యంగా బ్యాచిలర్స్ కు ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్ ఫాస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. మరి ఎంతో సులువైన రుచికరమైన ఈ ప్రైడ్ రైస్ ఏవిధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
*ఒక కప్ప రైస్
*కోడిగుడ్లు 3
*కారం అర టీ
*ఉప్పు తగినంత
*పసుపు చిటికెడు
*గరంమసాలా అర టీ స్పూన్
*ఉల్లిపాయ ముక్కలు అర కప్పు
*కరివేపాకు రెమ్మ
*రెండు పచ్చిమిర్చి ముక్కలు
*నూనె
ముందుగా ఒక కప్పు రైస్ తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ ఉంచి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి కలియబెట్టాలి. రెండు నిమిషాలు తర్వాత తగినంత ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కోడిగుడ్లను పగలగొట్టుకుని అందులో వేయాలి.కోడిగుడ్ల మిశ్రమాన్ని కాసేపు కదలకుండా తక్కువ మంటలో మగ్గించాలి. ఇందులోకి అర టీ స్పూన్ కారం వేసి నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని కలపాలి.ఎక్కువసార్లు కలపడం వల్ల కోడుగుడ్డు చిన్న ముక్కలుగా విడిపోవడంతో తినడానికి రుచిగా అనిపించదు. కనుక ఎక్కువ సార్లు కలియ పెట్టకుండా తక్కువ మంటలో బాగా ఫ్రై చేసుకోవాలి.ఎగ్ మొత్తం ఫ్రీ అయిన తర్వాత అందులోకి ముందుగా తయారు చేసుకున్న అన్నం కలుపుకోవాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కలుపుకుని కాస్త కొత్తిమీర తురుము చల్లుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైనట్లే.వేడి వేడిగా ఉన్న ఈ రైస్ లోకి కొద్దిగా ఉల్లిపాయముక్కలు నిమ్మకాయతో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…