అసలే కరోనా కష్టకాలం. రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు. అలాంటి వారిపై వీలైతే కనికరం చూపించాలి. కానీ కర్కశత్వం కాదు. ఆ పోలీస్ ఆఫీసర్ అలాగే చేశాడు. రహదారి పక్కన బండిపై కూరగాయలు అమ్ముకుంటున్న ఓ వ్యక్తిపై దాడి చేశాడు. ఈ క్రమంలో అతని తోపుడు బండిని కాలితో తన్నాడు. దీంతో దానిపై ఉన్న కూరగాయలు అన్నీ నాశనం అయ్యాయి. అయితే ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు.
పంజాబ్లో మే 15వ తేదీ వరకు లాక్డౌన్ను విధించారు. నిత్యావసరాలు, అత్యవసరం అయ్యే వస్తువులు, సరుకులను మాత్రమే అమ్మేందుకు అనుమతులు ఉన్నాయి. అయినప్పటికీ ఓ వ్యక్తి తన తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటుంటే అతనిపై అక్కడి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ నవదీప్ సింగ్ కించిత్ జాలి చూపించలేదు. ఆ తోపుడు బండిని కాలితో తన్నాడు.
అయితే ఆ వీడియో వైరల్ అయిన అనంతరం విషయం ఆ రాష్ట్ర డీజీపీ వరకు వెళ్లింది. దీంతో డీజీపీ దినకర్ గుప్తా నవదీప్ సింగ్ను సస్పెండ్ చేశారు. ఇక ఆ సంఘటన జరిగిన ఫగ్వారా ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులు తమ జీతాల్లోంచి కొంత మొత్తాన్ని సేకరించి ఆ వ్యక్తికి నష్ట పరిహారం కింద అందజేశారు.
టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొంండ, రష్మిక మందన్న వివాహం చేసుకున్న నేపథ్యంలో ఓ చిన్నారి సోషల్ మీడియాలో వారిని ఓ…
తన విడాకుల విషయం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎవరూ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తమిళనాడు…
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మార్చి 8, 2026న జరగనున్న భారత్, న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్…
నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య సంగీత చెంగల్ పట్టు జిల్లా కోర్టులో మరో కొత్త పిటిషన్ దాఖలు…
నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు.…
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ…
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు.…