అసలే కరోనా కష్టకాలం. రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు. అలాంటి వారిపై వీలైతే కనికరం చూపించాలి. కానీ కర్కశత్వం కాదు. ఆ పోలీస్ ఆఫీసర్ అలాగే చేశాడు. రహదారి పక్కన బండిపై కూరగాయలు అమ్ముకుంటున్న ఓ వ్యక్తిపై దాడి చేశాడు. ఈ క్రమంలో అతని తోపుడు బండిని కాలితో తన్నాడు. దీంతో దానిపై ఉన్న కూరగాయలు అన్నీ నాశనం అయ్యాయి. అయితే ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు.
పంజాబ్లో మే 15వ తేదీ వరకు లాక్డౌన్ను విధించారు. నిత్యావసరాలు, అత్యవసరం అయ్యే వస్తువులు, సరుకులను మాత్రమే అమ్మేందుకు అనుమతులు ఉన్నాయి. అయినప్పటికీ ఓ వ్యక్తి తన తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటుంటే అతనిపై అక్కడి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ నవదీప్ సింగ్ కించిత్ జాలి చూపించలేదు. ఆ తోపుడు బండిని కాలితో తన్నాడు.
అయితే ఆ వీడియో వైరల్ అయిన అనంతరం విషయం ఆ రాష్ట్ర డీజీపీ వరకు వెళ్లింది. దీంతో డీజీపీ దినకర్ గుప్తా నవదీప్ సింగ్ను సస్పెండ్ చేశారు. ఇక ఆ సంఘటన జరిగిన ఫగ్వారా ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులు తమ జీతాల్లోంచి కొంత మొత్తాన్ని సేకరించి ఆ వ్యక్తికి నష్ట పరిహారం కింద అందజేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…
UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…
QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరులకి ఆధార్ కార్డు అత్యంత…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…