దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. ఒకే రోజులో మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,12,262 కరోనా కేసులు నమోదయ్యాయి. 3,980 మంది చనిపోయారు. ఇప్పటి వరకు ఒక్క రోజులో అత్యంత ఎక్కువ స్థాయిలో మరణాలు సంభవించడం కూడా ఇదే తొలిసారి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది.
ఇక దేశంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 2,30,168కి చేరుకుంది. 35,66,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,20,113 మంది గడిచిన 24 గంటల్లో డిశ్చార్జి అయ్యారు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,72,80,844కు చేరుకుంది. ఇక ఒకే రోజులో 4 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదు కావడం ఇది రెండో సారి. మే 1వ తేదీన 4,01,993 కేసులు నమోదయ్యాయి.
మే 5వ తేదీన భారత్లో 3.82 లక్షల కోవిడ్ కేసులు నమోదు కాగా 3,780 మంది ఒకే రోజులో చనిపోయారు. ఇక 3 లక్షలకు పైగా కేసులు నమోదు కావడం వరుసగా ఇది 15వ రోజు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మొత్తం 29,67,75,209 శాంపిల్స్ను ఇప్పటి వరకు పరీక్షించింది. ఒక్క మే 5వ తేదీనే 19,23,131 శాంపిల్స్ ను పరీక్షించారు.
దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, కేరళ, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్గడ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ బీహార్, హర్యానాలలో అత్యధికంగా కేసులు నమోదు అవుతుండడమే కాగా యాక్టివ్ కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…