దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. ఒకే రోజులో మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,12,262 కరోనా కేసులు నమోదయ్యాయి. 3,980 మంది చనిపోయారు. ఇప్పటి వరకు ఒక్క రోజులో అత్యంత ఎక్కువ స్థాయిలో మరణాలు సంభవించడం కూడా ఇదే తొలిసారి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది.
ఇక దేశంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 2,30,168కి చేరుకుంది. 35,66,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,20,113 మంది గడిచిన 24 గంటల్లో డిశ్చార్జి అయ్యారు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,72,80,844కు చేరుకుంది. ఇక ఒకే రోజులో 4 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదు కావడం ఇది రెండో సారి. మే 1వ తేదీన 4,01,993 కేసులు నమోదయ్యాయి.
మే 5వ తేదీన భారత్లో 3.82 లక్షల కోవిడ్ కేసులు నమోదు కాగా 3,780 మంది ఒకే రోజులో చనిపోయారు. ఇక 3 లక్షలకు పైగా కేసులు నమోదు కావడం వరుసగా ఇది 15వ రోజు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మొత్తం 29,67,75,209 శాంపిల్స్ను ఇప్పటి వరకు పరీక్షించింది. ఒక్క మే 5వ తేదీనే 19,23,131 శాంపిల్స్ ను పరీక్షించారు.
దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, కేరళ, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్గడ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ బీహార్, హర్యానాలలో అత్యధికంగా కేసులు నమోదు అవుతుండడమే కాగా యాక్టివ్ కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…