హిందువులు పూజా సమయాలలో ఎక్కువభాగం రాగితో తయారుచేసిన పూజాసామాగ్రిని ఉపయోగించడం మనం చూస్తుంటాం. పూజ సమయంలో ఈ విధంగా రాగి పాత్రలను వాడటం వెనుక ఉన్న అర్థం, పరమార్థాన్ని వరాహపురాణంలో వరాహస్వామి భూదేవికి వివరించారు.
వరాహ పురాణం ప్రకారం.. కొన్ని యుగాల క్రితం గుడాకేశుడు అనే రాక్షసుడు విష్ణువు గురించి ఎంతో భక్తితో తపస్సు చేశాడు. ఆ రాక్షసుడి తపస్సుకు మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోవాలని అడగగా అందుకు గుడాకేశుడు తన దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించి భగవంతుడిలో ఐక్యం చేసుకోవాలని కోరాడు. అదే విధంగా తన శరీరంతో తయారు చేసిన సామాగ్రిని పూజా సమయంలో ఉపయోగించాలని కోరాడు.
ఇందుకు విష్ణువు వైశాఖ శుక్లపక్ష ద్వాదశి రోజు నీ కోరిక తీరుతుందని చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత వైశాఖ శుక్ల పక్ష ద్వాదశి రావడంతో గుడాకేశుడి తల సుదర్శన చక్రంతో ఖండించబడుతుంది. ఈ క్రమంలోనే తన ఆత్మ వైకుంఠం చేరగా తన శరీరం రాగిగా రూపొందింది. ఈ రాగి పాత్రలను తనకు పూజా సమయంలో ఉపయోగించాలని విష్ణుదేవుడు తన భక్తులను ఆదేశించాడు. అప్పటినుంచి పూజా సమయంలో రాగి వస్తువులను వాడటం ఆచారంగా వస్తోందని వరాహ స్వామి భూదేవికి వివరించాడు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…