హిందువులు పూజా సమయాలలో ఎక్కువభాగం రాగితో తయారుచేసిన పూజాసామాగ్రిని ఉపయోగించడం మనం చూస్తుంటాం. పూజ సమయంలో ఈ విధంగా రాగి పాత్రలను వాడటం వెనుక ఉన్న అర్థం, పరమార్థాన్ని వరాహపురాణంలో వరాహస్వామి భూదేవికి వివరించారు.
వరాహ పురాణం ప్రకారం.. కొన్ని యుగాల క్రితం గుడాకేశుడు అనే రాక్షసుడు విష్ణువు గురించి ఎంతో భక్తితో తపస్సు చేశాడు. ఆ రాక్షసుడి తపస్సుకు మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోవాలని అడగగా అందుకు గుడాకేశుడు తన దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించి భగవంతుడిలో ఐక్యం చేసుకోవాలని కోరాడు. అదే విధంగా తన శరీరంతో తయారు చేసిన సామాగ్రిని పూజా సమయంలో ఉపయోగించాలని కోరాడు.
ఇందుకు విష్ణువు వైశాఖ శుక్లపక్ష ద్వాదశి రోజు నీ కోరిక తీరుతుందని చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత వైశాఖ శుక్ల పక్ష ద్వాదశి రావడంతో గుడాకేశుడి తల సుదర్శన చక్రంతో ఖండించబడుతుంది. ఈ క్రమంలోనే తన ఆత్మ వైకుంఠం చేరగా తన శరీరం రాగిగా రూపొందింది. ఈ రాగి పాత్రలను తనకు పూజా సమయంలో ఉపయోగించాలని విష్ణుదేవుడు తన భక్తులను ఆదేశించాడు. అప్పటినుంచి పూజా సమయంలో రాగి వస్తువులను వాడటం ఆచారంగా వస్తోందని వరాహ స్వామి భూదేవికి వివరించాడు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…