మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 57,640 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో 920 మంది చనిపోయారు. ఈ క్రమంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య ఆ రాష్ట్రంలో 48,80,542కు చేరుకుంది. 72,662 మంది ఇప్పటి వరకు చనిపోయారు. ఏప్రిల్ 28వ తేదీ తరువాత ఒకే రోజు ఇంత ఎక్కువ స్థాయిలో మరణించడం ఇది రెండోసారి. ఆ రోజు 985 మంది చనిపోయారు.
ఇక మహారాష్ట్రలో గడిచిన 24 గంటల వ్యవధిలో 2,79,200 మందికి పరీక్షలు నిర్వహించారు. 41,64,098 మంది రికవరీ అయ్యారు. ఒక్క రోజులో 57,006 మంది డిశ్చార్జి అయ్యారు. మంగళవారం ఆ రాష్ట్రంలో 51,880 కోవిడ్ కేసులు నమోదు కాగా 891 మంది చనిపోయారు. సోమవారం 48,621 కేసులు నమోదయ్యాయి. 567 మంది చనిపోయారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం కొత్తగా 3,882 కరోనా కేసులు నమోదు కాగా 77 మంది చనిపోయారు. ఈ క్రమంలో ముంబైలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,65,057కు చేరుకుంది. 13,511 మంది చనిపోయారు. మంగళవారం ముంబైలో 2,554 కేసులు నమోదు కాగా, 62 మంది చనిపోయారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…