మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 57,640 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో 920 మంది చనిపోయారు. ఈ క్రమంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య ఆ రాష్ట్రంలో 48,80,542కు చేరుకుంది. 72,662 మంది ఇప్పటి వరకు చనిపోయారు. ఏప్రిల్ 28వ తేదీ తరువాత ఒకే రోజు ఇంత ఎక్కువ స్థాయిలో మరణించడం ఇది రెండోసారి. ఆ రోజు 985 మంది చనిపోయారు.
ఇక మహారాష్ట్రలో గడిచిన 24 గంటల వ్యవధిలో 2,79,200 మందికి పరీక్షలు నిర్వహించారు. 41,64,098 మంది రికవరీ అయ్యారు. ఒక్క రోజులో 57,006 మంది డిశ్చార్జి అయ్యారు. మంగళవారం ఆ రాష్ట్రంలో 51,880 కోవిడ్ కేసులు నమోదు కాగా 891 మంది చనిపోయారు. సోమవారం 48,621 కేసులు నమోదయ్యాయి. 567 మంది చనిపోయారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం కొత్తగా 3,882 కరోనా కేసులు నమోదు కాగా 77 మంది చనిపోయారు. ఈ క్రమంలో ముంబైలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,65,057కు చేరుకుంది. 13,511 మంది చనిపోయారు. మంగళవారం ముంబైలో 2,554 కేసులు నమోదు కాగా, 62 మంది చనిపోయారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…