మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 57,640 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో 920 మంది చనిపోయారు. ఈ క్రమంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య ఆ రాష్ట్రంలో 48,80,542కు చేరుకుంది. 72,662 మంది ఇప్పటి వరకు చనిపోయారు. ఏప్రిల్ 28వ తేదీ తరువాత ఒకే రోజు ఇంత ఎక్కువ స్థాయిలో మరణించడం ఇది రెండోసారి. ఆ రోజు 985 మంది చనిపోయారు.
ఇక మహారాష్ట్రలో గడిచిన 24 గంటల వ్యవధిలో 2,79,200 మందికి పరీక్షలు నిర్వహించారు. 41,64,098 మంది రికవరీ అయ్యారు. ఒక్క రోజులో 57,006 మంది డిశ్చార్జి అయ్యారు. మంగళవారం ఆ రాష్ట్రంలో 51,880 కోవిడ్ కేసులు నమోదు కాగా 891 మంది చనిపోయారు. సోమవారం 48,621 కేసులు నమోదయ్యాయి. 567 మంది చనిపోయారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం కొత్తగా 3,882 కరోనా కేసులు నమోదు కాగా 77 మంది చనిపోయారు. ఈ క్రమంలో ముంబైలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,65,057కు చేరుకుంది. 13,511 మంది చనిపోయారు. మంగళవారం ముంబైలో 2,554 కేసులు నమోదు కాగా, 62 మంది చనిపోయారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…