బడాబాబులు కొందరు డబ్బుందనే అహంకారంతో ఏమైనా చేస్తారు. తాము చేసే పనులను సరైనవే అని సమర్థించుకుంటుంటారు. సమాజంలో ఇలాంటి వారు మనకు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇప్పుడు చెప్పబోయే ఎమ్మెల్యే కూడా సరిగ్గా ఇదే కోవకు చెందినవాడే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
కర్ణాటకలోని కనకగిరి (కొప్పల్) ఎమ్మెల్యే బసవరాజ్ దడెసుగుర్ కుమారుడు సురేష్ ఇటీవలే తన బర్త్ డేను జరుపుకున్నాడు. అందుకు గాను అతను తన స్నేహితులను తన బీఎండబ్ల్యూ కార్లో అక్కడి హోసపేట్ అనే ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ గ్రాండ్గా బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నాడు.
అయితే బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కొన్ని కేకులను సురేష్ తన ఐఫోన్తో కట్ చేశాడు. ఒకదాని తరువాత ఒకటి కట్ చేస్తూ వెళ్లాడు. ఈ క్రమంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే డబ్బుందనే అహంకారంతోనే అతను ఈ విధంగా చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక దీనిపై ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించారు.
అసలే కోవిడ్ కాలం, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఇలాంటి సమయాల్లో వారికి సహాయం చేయాల్సింది పోయి.. డబ్బుందనే అహంకారంతో ఇలా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదన్నారు. అయితే దీనిపై సదరు ఎమ్మెల్యే బసవరాజ్ స్పందించారు. తాను కష్టపడి సంపాదించిన డబ్బు అని, దాన్ని ఖర్చు పెట్టే హక్కు తన కుమారుడికి ఉందని, అందుకనే బర్త్ డేను అలా జరుపుకున్నాడని సమర్థించారు. అంతేకాదు, కోవిడ్ కనుక కత్తితో కాకుండా ఐఫోన్తో కేక్ కట్ చేశాడని, దీంట్లో రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అన్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…