ప్రస్తుత కాలంలో ప్రభుత్వాలు అమ్మాయిల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నప్పటికీ రోజు రోజుకూ అమ్మాయిలపై, మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే వారిపై జరిగిన దాడులను బయటకు చెప్పుకోలేక ఎంతోమంది ఆత్మహత్య శరణం అనుకొని ఆ దారిని ఎంచుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన చాలా ఆలస్యంగా గుజరాత్ లో బయటకు వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
గుజరాత్ రాష్ట్రం బనస్కాంత జిల్లాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఎస్సీ వర్గానికి చెందిన ఓ యువతి చనిపోయిన పది రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు అనారోగ్యంతో చనిపోయిందని గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు. కానీ ఆమె సెల్ ఫోన్ అసలు విషయాన్ని బయట పెట్టింది. సదరు యువతిపై ముగ్గురు యువకులు లైంగికంగా దాడి చేయడమే కాకుండా ఆమె నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలను చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందారు.
అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయిన ఆ యువతికి ఆ యువకుల నుంచి ఒక వాట్సాప్ వీడియో వచ్చింది. ఆ వీడియోలో తనని తాను నగ్నంగా చూసుకోవడంతో ఎంతో అవమానంగా భావించింది. ఈ క్రమంలోనే ఆ యువకులు ఆమెకి ఫోన్ చేసి డబ్బులు కావాలని, లేకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో ఎంతో కుంగిపోయిన ఆ యువతి ఈ విషయం బయట పడితే తన తల్లిదండ్రులకు చెడ్డపేరు వస్తుందని భావించి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బయటకు మాత్రం తన తల్లిదండ్రులు అనారోగ్యం కారణంగా చనిపోయిందని అంత్యక్రియలు నిర్వహించారు. అయితే పోలీసులకు ఈ విషయం చేరడంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో పూడ్చిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ముగ్గురు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…