ప్రస్తుత కాలంలో ప్రభుత్వాలు అమ్మాయిల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నప్పటికీ రోజు రోజుకూ అమ్మాయిలపై, మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే వారిపై జరిగిన దాడులను బయటకు చెప్పుకోలేక ఎంతోమంది ఆత్మహత్య శరణం అనుకొని ఆ దారిని ఎంచుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన చాలా ఆలస్యంగా గుజరాత్ లో బయటకు వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
గుజరాత్ రాష్ట్రం బనస్కాంత జిల్లాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఎస్సీ వర్గానికి చెందిన ఓ యువతి చనిపోయిన పది రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు అనారోగ్యంతో చనిపోయిందని గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు. కానీ ఆమె సెల్ ఫోన్ అసలు విషయాన్ని బయట పెట్టింది. సదరు యువతిపై ముగ్గురు యువకులు లైంగికంగా దాడి చేయడమే కాకుండా ఆమె నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలను చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందారు.
అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయిన ఆ యువతికి ఆ యువకుల నుంచి ఒక వాట్సాప్ వీడియో వచ్చింది. ఆ వీడియోలో తనని తాను నగ్నంగా చూసుకోవడంతో ఎంతో అవమానంగా భావించింది. ఈ క్రమంలోనే ఆ యువకులు ఆమెకి ఫోన్ చేసి డబ్బులు కావాలని, లేకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో ఎంతో కుంగిపోయిన ఆ యువతి ఈ విషయం బయట పడితే తన తల్లిదండ్రులకు చెడ్డపేరు వస్తుందని భావించి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బయటకు మాత్రం తన తల్లిదండ్రులు అనారోగ్యం కారణంగా చనిపోయిందని అంత్యక్రియలు నిర్వహించారు. అయితే పోలీసులకు ఈ విషయం చేరడంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో పూడ్చిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ముగ్గురు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…