హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని చెట్లను దైవ సమానంగా భావిస్తారు. ఇలా దైవ సమానంగా భావించే మొక్కలను పూజించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని భావిస్తారు. ఈ క్రమంలోనే కొందరు మహిళలు ప్రత్యేక పర్వదినాలలో లేదా ప్రత్యేక మాసాలలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు. హిందూ ధర్మం ప్రకారం అత్యంత పవిత్రమైన చెట్లు ఏవి, వాటిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
జమ్మి చెట్టును హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ క్రమంలోనే జమ్మిచెట్టుకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మన ఇంట్లో సంపద శ్రేయస్సు పెరుగుతుంది. అలాగే శని గ్రహదోషం ఉన్నవారు శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల శనిగ్రహ దోషం తొలగిపోతుంది.
మర్రి చెట్టును కూడా ఎంతో పవిత్రమైన వృక్షంగా భావిస్తారు. మర్రి చెట్టుకు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల పితృదేవతల ఆత్మ సంతృప్తి చెందుతుందని భావిస్తారు. అలాగే మర్రి చెట్లలో సకల దేవతలు కొలువై ఉండటం వల్ల మర్రి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు. మరికొందరు మర్రిచెట్టుతోపాటు వేపచెట్టుకు కూడా పూజలు నిర్వహిస్తారు.
ప్రతి ఇంటి ఆవరణంలో తులసి మొక్క ఉండటం మనం చూస్తుంటాము. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించడం వల్ల తులసి మొక్కను పెద్ద ఎత్తున ఆరాధిస్తారు. ముఖ్యంగా చెట్టుకు సాయంత్రం నీరు పోయకుండా, ఏకాదశి తిథులలో తులసి మొక్కను తుంచకుండా పూజ చేయటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు.
ఉపవాస దీక్షలతో గురువారం అరటి చెట్టును పూజించడం వల్ల శ్రీహరి సంతృప్తి చెంది ఆయన అనుగ్రహం మనపై ఉంటుంది. ఉపవాసంతో అరటి చెట్టుకు మినప పప్పు బెల్లం నైవేద్యంగా సమర్పించి పూజించాలి. ఇలా చేయటం వల్ల అష్టైశ్వర్యాలకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…