సాధారణంగా పెళ్లిళ్లు భూలోకంలో ఆకాశమంత పందిళ్లను వేసే ఎంతో అంగరంగ వైభవంగా జరిపించడం మనం చూస్తూ ఉంటాము. కానీ కరోనా ప్రభావం వల్ల వివాహాలు ఎంతో సింపుల్ గా జరుగుతున్నాయి. ప్రస్తుతం వివాహాలు అధికంగా ఉన్న సమయంలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడంతో ఎంతో ఘనంగా చేయాలనుకున్న వివాహాలు సైతం సింపుల్ గా కానిచ్చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మధురైకి చెందిన రాకేష్, దక్షిణల వివాహ మే 25 మంగళవారం జరగాల్సి ఉంది. అందుకోసం పెళ్లి ఏర్పాట్లను ఎంతో ఘనంగా నిర్వహించిన ఇరు కుటుంబసభ్యులు వివాహం కోసం బెంగళూరు నుంచి విమానంలో మధురై కి బయలుదేరారు. ఈ క్రమంలోనే తమిళనాడులో కరోనా కేసులు అధికమవుతున్న నేపధ్యంలో మంగళవారం నుంచి సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం సూచించింది.
ఈ విధంగా లాక్ డౌన్ ప్రకటించడంతో చేసేదేమీ లేక పెళ్లి ఏర్పాట్లను రద్దు చేసుకున్నారు. అదేవిధంగా ఇరు కుటుంబ సభ్యులు రాకేష్ , దక్షిణల వివాహం విమానంలోనే జరిపించారు. ఇరు కుటుంబ సభ్యుల పెద్దల సమక్షంలో, వారి ఆశీర్వాదాలతో విమానంలోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…