బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటించిన సినిమాలన్నీ ఫాన్ ఇండియా తరహాలోనే తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ “సలార్” సినిమాలో నటిస్తున్నారు.ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా మొట్టమొదటిసారిగా శృతి హాసన్ జతకడుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ను ఢీ కొట్టడం కోసం పవర్ ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే…జాన్ అబ్రహం.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో విలన్ పాత్రలో నటించడం కోసం జాన్ అబ్రహం కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉందనేది మాత్రం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఒక షెడ్యుల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…