ప్రమాదాలు అనేవి చెప్ప జరగవు. అనుకోకుండానే జరుగుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఘోరమైన ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కానీ అలాంటి ఘటనల్లో బతికి బట్టకట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టే బతికిపోయారు.. అని మనం అనుకుంటుంటాం. కొందరు అలా లక్ కలసి రావడం వల్ల బతికిపోతుంటారు. సరిగ్గా అక్కడ కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
గుజరాత్లోని దాహోద్లో ఉన్న గోధ్రా – ఝాలోద్ జాతీయ రహదారిపై ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సును ఓవర్ టేక్ చేయబోయిన ఓ ద్విచక్ర వాహనదారుడు దానికి ముందుకు వచ్చి ముందు టైర్ల కింద పడ్డాడు. ఈ క్రమంలో బైక్ దూరంగా పడిపోయింది. అయితే అతని వేగం బస్సు వేగం కన్నా ఎక్కువ ఉంది. దీంతో బస్సు కింద పడినా అతను టైర్ల కింద నలగలేదు. టైర్లతోపాటు ముందుకు అలాగే వచ్చాడు. దీంతో బస్సు డ్రైవర్ సడెన్గా బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో అతను టైర్ల వద్ద ఉండిపోయాడు.
తరువాత అతనే నెమ్మదిగా లేచి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఇతర వాహనదారులు కొందరు అతని బైక్ను తీసి పక్కన పెట్టారు. అయితే అంతటి ప్రమాదం జరిగినప్పటికీ ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న ఆ వ్యక్తికి ఏమీ కాలేదు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డాడు. అలాగే లక్ కలసి వచ్చింది. లేదంటే టైర్ల కింద నలిగిపోయి ఉండేవాడు.
కాగా అదే సమయంలో అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఈ సంఘటన తాలూకు దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వాహనదారుడు నిజంగా అదృష్టవంతుడేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…