ప్రస్తుతం ఎన్నో సదుపాయాలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ కొందరు ఇప్పటికీ మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఏదైనా అనారోగ్యం వస్తే ముందుగా డాక్టర్ ను సంప్రదించకుండా భూత వైద్యులను సంప్రదించి తాయత్తులను కట్టిస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అశ్వాపురపాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
దేవయ్య, సంగీత అనే దంపతులకు రెండు నెలల క్రితం మగబిడ్డ జన్మించాడు. అయితే ఎంతో ఆరోగ్యంగా ఉన్న బిడ్డ గత రెండు రోజుల నుంచి ఏకధాటిగా ఏడుస్తూ ఉండడం వల్ల తల్లిదండ్రులు స్థానికంగా ఉండే దేవర బాల అనే భూతవైద్యుడి దగ్గరికి తీసుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆ భూతవైద్యుడు బాలుడు ఏడుపు మాన్పించడానికి బొడ్డు చుట్టూ పంటితో గట్టిగా కొరికాడు.
ఈ క్రమంలోనే బాలుడు మరింత గట్టిగా ఏడవడంతో వెంటనే తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే బాబు పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాబు మరణించాడు. అయితే బాబు ఏడవడంతో భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లడం వల్ల అతను ఆ బాలుడి బొడ్డు భాగంలో గట్టిగా కొరకడంతో లోపలి పేగు కట్ అయిందని, అందుకే బాబుకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చి మరణించాడని వైద్యులు తెలిపారు. కేవలం మూఢనమ్మకాల వల్ల ప్రజలు ఇప్పటికీ ఈ విధమైన బాధలను అనుభవిస్తూనే ఉన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…