ఈ ఆధునిక ప్రపంచంలో నిత్యం మనం అనేక వ్యాధులతో సతమతం అవుతున్నాం. మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్లే మనకు అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. అలాగే నిత్యం మనం తిరిగే వాతావరణం, కాలుష్యం వల్ల కూడా వ్యాధులు వస్తున్నాయి. అందువల్ల నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం నివసించలేని పరిస్థితి నెలకొంది.
అయితే నగరాలు, పట్టణాల్లో నివసిస్తే ఎంతటి ప్రమాదకరమో అతనికి జరిగిన సంఘటన మనకు చాటి చెబుతుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
1972లో వియత్నాంలో యుద్ధం జరగడం వల్ల హో వాన్ లాంగ్ ను తన తండ్రి అడవిలోకి తీసుకెళ్లాడు. ఆ తరువాత అక్కడి కువాంగ్ గాయ్ ప్రావిన్స్ లో ఉన్న టే ట్రా జిల్లాలోని దట్టమైన అడవిలో ఆ ఇద్దరూ నివాసం ఉన్నారు. ఈ క్రమంలోనే 2013లో లాంగ్ తండ్రి చనిపోయాడు. తరువాత 4 ఏళ్లకు.. అంటే 2017లో లాంగ్ సిటీకి మకాం మార్చాడు.
అయితే అడవిలో ఉన్నప్పుడు స్వచ్ఛమైన వాతావరణం ఉండేది. చక్కని ఆహారం తినేవాడు. కానీ సిటీకి వచ్చాక లైఫ్ స్టైల్ మారిపోయింది. లాంగ్ ఎక్కువగా మద్యం సేవించేవాడు. ప్రాసెస్ చేయబడిన ఆహారాలను ఎక్కువగా తినేవాడు. దీంతో అతనికి లివర్ క్యాన్సర్ వచ్చింది. ఈ క్రమంలో అతను ఇటీవలే మృతి చెందాడు.
అలా అతను 41 ఏళ్ల పాటు అడవిలో ఉన్నా అతనికి ఏమీ కాలేదు. కానీ కేవలం 4 ఏళ్లు సిటీలో ఉండి జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసుకున్నాడు. దీంతో లివర్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అందుకనే సహజసిద్ధమైన ప్రకృతిలో నివసిస్తే ఎక్కువ కాలం పాటు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండవచ్చని నిపుణులు చెబుతుంటారు. అది ఇతని విషయంలో అక్షరాలా నిజమే అనిపిస్తుంది కదా..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…