ఈ ఆధునిక ప్రపంచంలో నిత్యం మనం అనేక వ్యాధులతో సతమతం అవుతున్నాం. మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్లే మనకు అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. అలాగే నిత్యం మనం తిరిగే వాతావరణం, కాలుష్యం వల్ల కూడా వ్యాధులు వస్తున్నాయి. అందువల్ల నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం నివసించలేని పరిస్థితి నెలకొంది.
అయితే నగరాలు, పట్టణాల్లో నివసిస్తే ఎంతటి ప్రమాదకరమో అతనికి జరిగిన సంఘటన మనకు చాటి చెబుతుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
1972లో వియత్నాంలో యుద్ధం జరగడం వల్ల హో వాన్ లాంగ్ ను తన తండ్రి అడవిలోకి తీసుకెళ్లాడు. ఆ తరువాత అక్కడి కువాంగ్ గాయ్ ప్రావిన్స్ లో ఉన్న టే ట్రా జిల్లాలోని దట్టమైన అడవిలో ఆ ఇద్దరూ నివాసం ఉన్నారు. ఈ క్రమంలోనే 2013లో లాంగ్ తండ్రి చనిపోయాడు. తరువాత 4 ఏళ్లకు.. అంటే 2017లో లాంగ్ సిటీకి మకాం మార్చాడు.
అయితే అడవిలో ఉన్నప్పుడు స్వచ్ఛమైన వాతావరణం ఉండేది. చక్కని ఆహారం తినేవాడు. కానీ సిటీకి వచ్చాక లైఫ్ స్టైల్ మారిపోయింది. లాంగ్ ఎక్కువగా మద్యం సేవించేవాడు. ప్రాసెస్ చేయబడిన ఆహారాలను ఎక్కువగా తినేవాడు. దీంతో అతనికి లివర్ క్యాన్సర్ వచ్చింది. ఈ క్రమంలో అతను ఇటీవలే మృతి చెందాడు.
అలా అతను 41 ఏళ్ల పాటు అడవిలో ఉన్నా అతనికి ఏమీ కాలేదు. కానీ కేవలం 4 ఏళ్లు సిటీలో ఉండి జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసుకున్నాడు. దీంతో లివర్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అందుకనే సహజసిద్ధమైన ప్రకృతిలో నివసిస్తే ఎక్కువ కాలం పాటు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండవచ్చని నిపుణులు చెబుతుంటారు. అది ఇతని విషయంలో అక్షరాలా నిజమే అనిపిస్తుంది కదా..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…