సాధారణంగా పెళ్ళి అయిన తర్వాత ప్రతి ఒక్క భర్త తనకు సంతానం కలగాలని తన భార్యను ఎంతో ఉన్నతంగా చూసుకోవాలని భావిస్తాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. పెళ్లి అయిన తరువాత తన భార్యకు నరకం అంటే ఏమిటో చూపించాడు. దీంతో అతని చిత్ర హింసలను తట్టుకోలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు అతన్ని కటకటాల వెనక్కి పంపించారు. వివరాల్లోకి వెళితే..
విజయవాడకు చెందిన జోత్స్న అనే యువతి ఎంబీఏ చదివి బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ఆ సమయంలోనే సుశాంత్ చౌదరి అనే వ్యక్తి జోత్స్నను ప్రేమించి తన ప్రేమ విషయాన్ని ఆమెకు తెలియజేశాడు. అందుకు జోత్స్న ఒప్పుకోకపోవడంతో అతను చనిపోతానని బెదిరించాడు. దీంతో ఆమె ఆ ప్రేమను అంగీకరించాల్సి వచ్చింది. అయితే ఇద్దరూ ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో వారి పెళ్లి విషయం వారి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు వీరిద్దరికీ ఎంతో అంగరంగ వైభవంగా వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. యువతి తల్లిదండ్రులు పెద్దఎత్తున కట్న కానుకలను సమర్పించారు.
ఈ విధంగా పెళ్లి తర్వాత బెంగళూరులో నివాసమున్న ఈ జంట కొన్ని రోజులకు సుశాంత్ చౌదరి గ్రామానికి వచ్చారు. ఎప్పుడైతే జోత్స్న అత్తారింట్లో నివాసం ఉంటుందో అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఎవరో మాంత్రికుడు తన ఇంటి వారసులను బలిస్తే వారికి లంకెబిందెలు దొరుకుతాయని చెప్పడంతో కుటుంబ సభ్యులు మొత్తం ఆమెపై అధిక ఒత్తిడి తెచ్చి పిల్లల్ని కనాలని తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవారు. ఇదే విషయమే తన తల్లిదండ్రులతో చెప్పడం వల్ల తల్లిదండ్రులు మందలించి వీరిద్దరిని బెంగళూరుకు పంపించారు. అక్కడికి వెళ్లినప్పటికీ ఆమెకు ఏమాత్రం బాధలు తప్పలేదు. ఈ క్రమంలోనే సుశాంత్ చౌదరి నువ్వు పిల్లల్ని కనిస్తావా.. లేకపోతే నేను మరొకరితో పిల్లల్ని కనాలా.. అంటూ ఆమెను తరచూ చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో జోత్స్న తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకొని పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…