సాధారణంగా వినాయక చవితి ఉత్సవాలు వస్తే వినాయకుడి ప్రతిమలను తొమ్మిది రోజుల పాటు పూజించి అనంతరం విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. అయితే వినాయకుడి విగ్రహాలను చెరువులు, నీటి కుంటలలో నిమజ్జనం చేస్తుంటారు. కానీ మీరు ఎప్పుడైనా వినాయకుడి నిమజ్జనం షవర్ కింద చేయడం చూశారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. హైదరాబాద్ నగర శివారులోని బాచుపల్లి హరితవనం కాలనీలో ఈవిధంగా నిమజ్జనం చేశారు.
గత పది సంవత్సరాల నుంచి కాలనీవాసులు కేవలం మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ నిమజ్జనాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది భిన్నంగా వినాయకుడి నిమజ్జనం చేయాలని ఉద్దేశించిన వీరు 8.5 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి తొమ్మిది రోజుల తర్వాత ఆ విగ్రహాన్ని షవర్ కింద ఏర్పాటు చేశారు.
వినాయకుడి విగ్రహ నిమజ్జనం కోసం 50 వేల రూపాయలతో ప్రత్యేక స్టాండ్ ఏర్పాటు చేసి దానిపై మోటార్ సహాయంతో ప్రత్యేక ఏర్పాటు చేశారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన వినాయకుడి నిమజ్జనం మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు పూర్తయింది. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా నిజాంపేట్ కార్పొరేటర్ విజయలక్ష్మి తెలిపారు. ప్రస్తుతం ఈ నిమజ్జనానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…