కరోనా వల్ల ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయి బతుకు బండిని ఈడుస్తుంటే కొందరు అప్పటికే నిండా కష్టాలతో జీవనం వెళ్లదీస్తున్నారు. అలాంటి వారిలో ఆ మహిళ కూడా ఒకరు. ఆమె పీజీ చదివింది. అయినప్పటికీ విధివశాత్తూ స్వీపర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించింది. కానీ మంత్రి కేటీఆర్ చొరవతో ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. వివరాల్లోకి వెళితే..
వరంగల్ జిల్లాకు చెందిన రజని అనే మహిళ 2013లో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసింది. పీజీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అయితే ఆమెకు హెచ్సీయూలో పీహెచ్డీ చేసేందుకు ఆఫర్ వచ్చింది. కానీ ఆమెకు వివాహం అవడంతో పీహెచ్డీ చేయలేదు. ఆమె భర్త అడ్వకేట్. కానీ ఆయనకు గుండె జబ్బు రావడంతో మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో కుటుంబ పోషణ భారం రజనిపై పడింది. ఈ క్రమంలోనే ఆమె మొదట్లో తోపుడు బండిపై కూరగాయలు అమ్మేది.
అయితే తరువాత ఆమె జీహెచ్ఎంసీలో కాంట్రాక్టు పద్ధతిలో స్వీపర్గా చేరింది. నెలకు రూ.10వేలు వచ్చేవి. కానీ అవి ఆమెకు ఏమాత్రం సరిపోయేవి కావు. దీంతో ఆమె దుర్భరమైన జీవితాన్ని గడుపుతోంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ స్వయంగా ఆమెను తన కార్యాలయానికి పిలిపించుకుని ఆమెకు జీహెచ్ఎంసీలోనే ఉన్నత స్థాయిలో ఉద్యోగం ఇచ్చారు. ఆమెను ఎంటమాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్గా నియమించారు. దీంతో ఆమె మంత్రి ఎదుట భావోద్వేగానికి గురైంది. తన కష్టాలు తెలుసుకుని తనకు ఈ జాబ్ ఇప్పించినందుకు ఆమె మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…