కరోనా వల్ల ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయి బతుకు బండిని ఈడుస్తుంటే కొందరు అప్పటికే నిండా కష్టాలతో జీవనం వెళ్లదీస్తున్నారు. అలాంటి వారిలో ఆ మహిళ కూడా ఒకరు. ఆమె పీజీ చదివింది. అయినప్పటికీ విధివశాత్తూ స్వీపర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించింది. కానీ మంత్రి కేటీఆర్ చొరవతో ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. వివరాల్లోకి వెళితే..
వరంగల్ జిల్లాకు చెందిన రజని అనే మహిళ 2013లో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసింది. పీజీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అయితే ఆమెకు హెచ్సీయూలో పీహెచ్డీ చేసేందుకు ఆఫర్ వచ్చింది. కానీ ఆమెకు వివాహం అవడంతో పీహెచ్డీ చేయలేదు. ఆమె భర్త అడ్వకేట్. కానీ ఆయనకు గుండె జబ్బు రావడంతో మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో కుటుంబ పోషణ భారం రజనిపై పడింది. ఈ క్రమంలోనే ఆమె మొదట్లో తోపుడు బండిపై కూరగాయలు అమ్మేది.
అయితే తరువాత ఆమె జీహెచ్ఎంసీలో కాంట్రాక్టు పద్ధతిలో స్వీపర్గా చేరింది. నెలకు రూ.10వేలు వచ్చేవి. కానీ అవి ఆమెకు ఏమాత్రం సరిపోయేవి కావు. దీంతో ఆమె దుర్భరమైన జీవితాన్ని గడుపుతోంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ స్వయంగా ఆమెను తన కార్యాలయానికి పిలిపించుకుని ఆమెకు జీహెచ్ఎంసీలోనే ఉన్నత స్థాయిలో ఉద్యోగం ఇచ్చారు. ఆమెను ఎంటమాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్గా నియమించారు. దీంతో ఆమె మంత్రి ఎదుట భావోద్వేగానికి గురైంది. తన కష్టాలు తెలుసుకుని తనకు ఈ జాబ్ ఇప్పించినందుకు ఆమె మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…