Sleep : మనం నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. నియమాలను అనుసరించి మనం నిద్రపోతే చక్కటి ఫలితం కనబడుతుంది. అయితే ఎప్పుడైనా మీరు పండితులు చెప్పడాన్ని వినే ఉంటారు. ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రపోకూడదు అని. అయితే అసలు ఎందుకు ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రపోకూడదు..?, దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరం వైపుగా తల పెట్టుకుని నిద్రపోవడం వలన చెడు కలలు వస్తాయని, మనసుని దెబ్బతీసేలా ఉంటాయని అంటారు.
ఉత్తరం వైపు నిద్రపోతే పాజిటివ్ ఎనర్జీని కోల్పోతారు కూడా. పూర్వీకుల నుండి కూడా ఇలా చెప్పడం జరుగుతోంది. అయితే ఉత్తరం వైపు తల పెట్టుకుని ఎందుకు నిద్రపోకూడదు అనే విషయానికి వచ్చేస్తే.. ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్ర పోవడం వలన సైంటిఫిక్ పరంగా చూసుకున్నట్లయితే, రక్తప్రసరణకి ఆటంకం అవుతుంది. నిద్రలో ఆటకం ఏర్పడుతుంది. కాబట్టి అలా నిద్రపోకూడదని అంటారు. ఎనర్జీ లెవెల్స్ కూడా ఉత్తరం వైపు నిద్రపోవడం వల్ల తగ్గిపోతాయి.
ఆధ్యాత్మికపరంగా చూసుకున్నట్లయితే పార్వతీ దేవి స్నానానికి వెళ్ళినప్పుడు గణపతిని తలుపు దగ్గర కాపలాగా పెడుతుంది. ఎవరినీ లోపలికి రాకుండా చూసుకోమని చెప్తుంది. వినాయకుడికి శివుడు పార్వతీ దేవి భర్త అని తెలిసినా శివుడిని లోపలికి వెళ్ళకుండా వినాయకుడు అడ్డుకుంటాడు. పార్వతీ దేవి బయటకి వచ్చేసరికి శివుడు, గణపతి గొడవ పడుతూ ఉంటారు.
శివుడికి కోపం వచ్చి వినాయకుడి తల నరికేస్తాడు. పార్వతీ దేవి ఆగ్రహానికి లోనై తన బిడ్డను తిరిగి కాపాడాలని మొండిపట్టు పడుతుంది. శివుడు ఆదేశించగా అతని భటులు ఉత్తరం దిశగా నిద్రిస్తున్న జీవుల కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఒక ఏనుగుని చూస్తారు. ఆ ఏనుగు తల నరికి శివుడికి ఇస్తారు. ఇలా ఉత్తరం వైపు పడుకున్న వాళ్ళ తలని తీసుకున్నారని, ఇలా ఈ దిశలో పడుకోకూడదని చెప్తూ ఉంటారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…