Lord Shiva : చాలామంది శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. శివుడిని ఆరాధించడం వలన చక్కటి ఫలితం కనబడుతుంది. శివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం చేస్తే శివుడు పొంగిపోతాడు. సంతోష పడతాడు. శివుడిని రోజూ ఆరాధిస్తారు. ముఖ్యంగా శివరాత్రి నాడు శివుడిని కచ్చితంగా ఆరాధిస్తారు. అభిషేకం చేయడం వలన శివుడి అనుగ్రహం కలుగుతుంది. పైగా జీవితానికి పట్టిన పీడ కూడా పోతుంది. అయితే పరమశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తిపరిస్తే దోషాలు పోతాయి.
ఆయురారోగ్యాలు, ధన ధాన్యాలు ప్రాప్తిస్తాయి. శివుడిని నీటితో కానీ పాలతో కానీ అభిషేకిస్తూ ఉంటారు. చాలా మంది ఏ ద్రవంతో అభిషేకించినా ఫలితం ఒకే విధంగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు చెప్పినట్లు, ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో ఫలితం కనిపిస్తుంది. ఇక మరి వేటితో అభిషేకం చేస్తే, ఎలాంటి ఫలితం కనబడుతుంది అనేది చూద్దాం. గరిక నీటితో శివుడికి అభిషేకం చేయడం వలన నష్టపోయిన వాటిని తిరిగి పొందడానికి అవుతుంది.
నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యువు నశించగలదు. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి. పెరుగుతో కనుక అభిషేకం చేస్తే బలము, ఆరోగ్యము, యశస్సు ఉంటాయి. ఆవు నేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. చెరుకు రసంతో అభిషేకిస్తే ధన వృద్ధి కలుగుతుంది. మెత్తని చక్కెరతో అభిషేకం చేస్తే దుఃఖ నాశనం కలుగుతుంది. మారేడు బిల్వ జలముతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి.
తేనెతో అభిషేకం చేస్తే తేజోవృద్ది కలుగుతుంది. పుష్పోదకముతో అభిషేకం చేస్తే భూ లాభము కలుగుతుంది. కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి. రుద్రాక్ష జలముతో అభిషేకం చేయడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. భస్మాభిషేకంతో మహా పాపాలు పోతాయి. బంగారం నీటితో చేస్తే దరిద్రం పోతుంది. నీటితో చేస్తే నష్టమైనవి తిరిగి పొందడానికి అవుతుంది. ఇలా ఈ విధంగా అభిషేకం చేస్తే ఇలాంటి ఫలితాలు కనబడతాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…