అలాంటి వారికి శుభవార్త చెప్పిన కేంద్రం.. వారందరికీ రూ.10 వేల సహాయం..

July 23, 2021 11:08 AM

దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తను తెలియజేసింది.అమెండ్‌మెంట్ 2019 బిల్లుకు ఆమోద ముద్ర వేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2019 వ సంవత్సరంలోనే మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ చెప్పింది. అయితే ఈ బిల్లుపై పార్లమెంట్ ఆమోదముద్ర వేయలేదు.

ప్రస్తుత కాలంలో సీనియర్ సిటిజన్ లను తల్లిదండ్రులను వారి పిల్లలు వదిలేయకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవడం కోసమే ఈ పథకాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.చాలా మంది పిల్లలు వారి తల్లిదండ్రుల పోషణ భారం అవుతున్న నేపథ్యంలో వారిని ఒంటరిగా వదిలి పెడుతున్నారు. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులకు పోషణ, భద్రత కల్పించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.

పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకుఆమోదం తెలిపితే ప్రస్తుతమున్న ఈ కరోనా పరిస్థితులలో ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ కు ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు ఈ బిల్లు చట్టంగా మారితే మెయింటెనెన్స్ చార్జీల కింద పది వేలు కన్నా ఎక్కువగా లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం అమెండ్‌మెంట్ 2007 చట్టాన్ని సవరణ చేస్తూ 2019 బిల్లును తీసుకు వస్తోంది. పిల్లలు లేదా బంధువులు 15 రోజుల్లోగానే మెయింటెన్స్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now