దేశంలోని పాన్ కార్డు దారులు తమ పాన్ ను ఆధార్తో అనుసంధానించేందుకు కేంద్రం ఇప్పటికే పలు మార్లు గడువును పెంచిన విషయం విదితమే. కరోనా నేపథ్యంలో, పలు ఇతర కారణాల వల్ల ఆ గడువును పెంచుతూ పోతున్నారు. అయితే మళ్లీ కరోనా ప్రభావం ప్రారంభమైన నేపథ్యంలో ఆ గడువును ఇంకా పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎక్స్పైర్ అయిన డ్రైవింగ్ లైసెన్స్లు, వాహన ధ్రువపత్రాల గడువును కేంద్రం జూన్ 30వ తేదీ వరకు పెంచింది. దీంతో పాన్-ఆధార్ అనుసంధానానికి గడువును కూడా పెంచుతారని తెలుస్తోంది. అయితే గడువు పెంచినా, పెంచకపోయినా కచ్చితంగా ఎవరైనా సరే తమ పాన్ను ఆధార్తో అనుసంధానించాలి. లేదంటే రూ.1000 జరిమానా విధిస్తారు.
కేంద్రం ఇటీవలే ఫైనాన్స్ బిల్ 2021ని లోక్సభలో ప్రవేశపెట్టింది. దీన్ని ఇంకా అమలు చేయలేదు. కానీ ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అయితే ఈ బిల్లును అమలు చేస్తే పాన్, ఆధార్లను గడువులోగా అనుసంధానం చేయని వారికి రూ.1000 జరిమానా విధిస్తారు. కనుక పాన్-ఆధార్లను లింక్ చేయాల్సి ఉంటుంది. ఇక కింద తెలిపిన స్టెప్స్ పాటిస్తే మీ పాన్ను ఆధార్తో సులభంగా అనుసంధానం చేయవచ్చు.
1. ఇంటర్నెట్ బ్రౌజర్ను పీసీలో ఓపెన్ చేసి అందులో https://www.incometaxindiaefiling.gov.in/home అనే ఇన్కమ్ట్యాక్స్ విభాగ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి.
2. అక్కడ పేజీకి ఎడమ భాగంలో ఉండే Quick Links అనే సెక్షన్లోని Link Aadhaar అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.
3. తరువాత వచ్చే పేజీలో మీ పాన్, ఆధార్ నంబర్ల వివరాలు, పేరును నమోదు చేయాలి. ఆధార్ లో ఉన్నట్లు పేరును తెలపాల్సి ఉంటుంది.
4. ఆధార్ కార్డులో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే చెక్ బాక్స్లో క్లిక్ చేయాలి. తరువాత యుఐడీఏఐతో ఆధార్ వివరాలను ధ్రువీకరించేందుకు చెక్బాక్స్లో క్లిక్ చేయాలి.
5. అనంతరం కాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి.
6. తరువాత Link Aadhaar అనే ట్యాబ్పై క్లిక్ చేయాలి. దీంతో ప్రక్రియ పూర్తవుతుంది.
ఇలా పాన్, ఆధార్లను అనుసంధానం చేయవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…