దేశంలోని పాన్ కార్డు దారులు తమ పాన్ ను ఆధార్తో అనుసంధానించేందుకు కేంద్రం ఇప్పటికే పలు మార్లు గడువును పెంచిన విషయం విదితమే. కరోనా నేపథ్యంలో, పలు ఇతర కారణాల వల్ల ఆ గడువును పెంచుతూ పోతున్నారు. అయితే మళ్లీ కరోనా ప్రభావం ప్రారంభమైన నేపథ్యంలో ఆ గడువును ఇంకా పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎక్స్పైర్ అయిన డ్రైవింగ్ లైసెన్స్లు, వాహన ధ్రువపత్రాల గడువును కేంద్రం జూన్ 30వ తేదీ వరకు పెంచింది. దీంతో పాన్-ఆధార్ అనుసంధానానికి గడువును కూడా పెంచుతారని తెలుస్తోంది. అయితే గడువు పెంచినా, పెంచకపోయినా కచ్చితంగా ఎవరైనా సరే తమ పాన్ను ఆధార్తో అనుసంధానించాలి. లేదంటే రూ.1000 జరిమానా విధిస్తారు.
కేంద్రం ఇటీవలే ఫైనాన్స్ బిల్ 2021ని లోక్సభలో ప్రవేశపెట్టింది. దీన్ని ఇంకా అమలు చేయలేదు. కానీ ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అయితే ఈ బిల్లును అమలు చేస్తే పాన్, ఆధార్లను గడువులోగా అనుసంధానం చేయని వారికి రూ.1000 జరిమానా విధిస్తారు. కనుక పాన్-ఆధార్లను లింక్ చేయాల్సి ఉంటుంది. ఇక కింద తెలిపిన స్టెప్స్ పాటిస్తే మీ పాన్ను ఆధార్తో సులభంగా అనుసంధానం చేయవచ్చు.
1. ఇంటర్నెట్ బ్రౌజర్ను పీసీలో ఓపెన్ చేసి అందులో https://www.incometaxindiaefiling.gov.in/home అనే ఇన్కమ్ట్యాక్స్ విభాగ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి.
2. అక్కడ పేజీకి ఎడమ భాగంలో ఉండే Quick Links అనే సెక్షన్లోని Link Aadhaar అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.
3. తరువాత వచ్చే పేజీలో మీ పాన్, ఆధార్ నంబర్ల వివరాలు, పేరును నమోదు చేయాలి. ఆధార్ లో ఉన్నట్లు పేరును తెలపాల్సి ఉంటుంది.
4. ఆధార్ కార్డులో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే చెక్ బాక్స్లో క్లిక్ చేయాలి. తరువాత యుఐడీఏఐతో ఆధార్ వివరాలను ధ్రువీకరించేందుకు చెక్బాక్స్లో క్లిక్ చేయాలి.
5. అనంతరం కాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి.
6. తరువాత Link Aadhaar అనే ట్యాబ్పై క్లిక్ చేయాలి. దీంతో ప్రక్రియ పూర్తవుతుంది.
ఇలా పాన్, ఆధార్లను అనుసంధానం చేయవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…