మొబైల్స్ తయారీ కంపెనీ పోకో భారత్ లో పోకో ఎక్స్3 ప్రొ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఇందులో 6.67 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ను అందిస్తున్నారు. ఈ ఫోన్ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ను కలిగి ఉంది. ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ను అమర్చారు. 8జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ఇందులో లిక్విడ్ కూలింగ్ 1.0 ప్లస్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ ఫోన్తో గేమ్స్ ఆడినా, వీడియోలు చూసినా పెద్దగా హీట్ అవ్వదు. ఈ ఫోన్లో వినియోగదారులకు ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది.
ఈ ఫోన్లో వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సల్ పోర్ట్రెయిట్ షాట్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 20 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్కన ఉంటుంది. ఈ ఫోన్లో 5160 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చారు. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అందువల్ల ఫోన్ కేవలం 59 నిమిషాల్లోనే 0 నుంచి 100 శాతం చార్జింగ్ పూర్తవుతుంది.
పోకో ఎక్స్3 ప్రొ స్మార్ట్ ఫోన్ గ్రాఫైట్ బ్లాక్, స్టీల్ బ్లూ, గోల్డెన్ బ్రాంజ్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.18,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.20,999గా ఉంది. ఈ ఫోన్ను ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్లో విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్పై ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఈఎంఐ సదుపాయం లభిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…