మొబైల్స్ తయారీ కంపెనీ పోకో భారత్ లో పోకో ఎక్స్3 ప్రొ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఇందులో 6.67 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ను అందిస్తున్నారు. ఈ ఫోన్ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ను కలిగి ఉంది. ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ను అమర్చారు. 8జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ఇందులో లిక్విడ్ కూలింగ్ 1.0 ప్లస్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ ఫోన్తో గేమ్స్ ఆడినా, వీడియోలు చూసినా పెద్దగా హీట్ అవ్వదు. ఈ ఫోన్లో వినియోగదారులకు ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది.
ఈ ఫోన్లో వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సల్ పోర్ట్రెయిట్ షాట్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 20 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్కన ఉంటుంది. ఈ ఫోన్లో 5160 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చారు. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అందువల్ల ఫోన్ కేవలం 59 నిమిషాల్లోనే 0 నుంచి 100 శాతం చార్జింగ్ పూర్తవుతుంది.
పోకో ఎక్స్3 ప్రొ స్మార్ట్ ఫోన్ గ్రాఫైట్ బ్లాక్, స్టీల్ బ్లూ, గోల్డెన్ బ్రాంజ్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.18,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.20,999గా ఉంది. ఈ ఫోన్ను ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్లో విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్పై ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఈఎంఐ సదుపాయం లభిస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…