కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అందరినీ కలవరపెడుతోంది. అయినప్పటికీ వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ లను ప్రజలకు ఇస్తున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ను బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కోవాగ్జిన్ను దేశంలోని భారత్ బయోటెక్ సంస్థ రూపొందించింది.
కాగా కోవిషీల్డ్, కోవాగ్జిన్లను ప్రస్తుతం భారత్ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా 1 లక్ష డోసుల కోవాగ్జిన్ టీకాలను పరాగ్వేకు పంపించారు. ఆ డోసులను ఆ దేశం స్వీకరించింది. ఈ వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జై శంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మేడిన్ ఇండియా వ్యాక్సిన్ పరాగ్వేకు చేరుకుందని తెలిపారు.
పరాగ్వేలో ఇప్పటి వరకు 2,09,000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 4063 మంది అక్కడ చనిపోయారు. భారత్ కేవలం పరాగ్వేకు మాత్రమే కాకుండా ఇప్పటి వరకు పలు ఇతర దేశాలకు కూడా కోవిడ్ టీకా డోసులను పంపిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 638.81 లక్షల వ్యాక్సిన్ డోసులను భారత్ ఇతర దేశాలకు పంపించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…