కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అందరినీ కలవరపెడుతోంది. అయినప్పటికీ వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ లను ప్రజలకు ఇస్తున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ను బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కోవాగ్జిన్ను దేశంలోని భారత్ బయోటెక్ సంస్థ రూపొందించింది.
కాగా కోవిషీల్డ్, కోవాగ్జిన్లను ప్రస్తుతం భారత్ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా 1 లక్ష డోసుల కోవాగ్జిన్ టీకాలను పరాగ్వేకు పంపించారు. ఆ డోసులను ఆ దేశం స్వీకరించింది. ఈ వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జై శంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మేడిన్ ఇండియా వ్యాక్సిన్ పరాగ్వేకు చేరుకుందని తెలిపారు.
పరాగ్వేలో ఇప్పటి వరకు 2,09,000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 4063 మంది అక్కడ చనిపోయారు. భారత్ కేవలం పరాగ్వేకు మాత్రమే కాకుండా ఇప్పటి వరకు పలు ఇతర దేశాలకు కూడా కోవిడ్ టీకా డోసులను పంపిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 638.81 లక్షల వ్యాక్సిన్ డోసులను భారత్ ఇతర దేశాలకు పంపించింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…