కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అందరినీ కలవరపెడుతోంది. అయినప్పటికీ వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ లను ప్రజలకు ఇస్తున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ను బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కోవాగ్జిన్ను దేశంలోని భారత్ బయోటెక్ సంస్థ రూపొందించింది.
కాగా కోవిషీల్డ్, కోవాగ్జిన్లను ప్రస్తుతం భారత్ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా 1 లక్ష డోసుల కోవాగ్జిన్ టీకాలను పరాగ్వేకు పంపించారు. ఆ డోసులను ఆ దేశం స్వీకరించింది. ఈ వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జై శంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మేడిన్ ఇండియా వ్యాక్సిన్ పరాగ్వేకు చేరుకుందని తెలిపారు.
పరాగ్వేలో ఇప్పటి వరకు 2,09,000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 4063 మంది అక్కడ చనిపోయారు. భారత్ కేవలం పరాగ్వేకు మాత్రమే కాకుండా ఇప్పటి వరకు పలు ఇతర దేశాలకు కూడా కోవిడ్ టీకా డోసులను పంపిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 638.81 లక్షల వ్యాక్సిన్ డోసులను భారత్ ఇతర దేశాలకు పంపించింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…