పిఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. గంటలో లక్ష పొందండిలా..

July 9, 2021 10:33 PM

మీకు పిఎస్ ఖాతా ఉందా.. అయితే మీకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సర్వీసులను అమలులోకి తెచ్చింది. ఈ సర్వీస్ ల వల్ల ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ కోసం కేవలం కొంత సమయంలోనే డబ్బులను పొందవచ్చు.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సబ్‌స్క్రైబర్లు మెడికల ఎమర్జెన్సీ సమయంలో పీఎఫ్ అకౌంట్ నుంచి రూ.లక్ష వరకు వెంటనే విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

ఈపీఎఫ్‌వో జూన్ 1న ఒక సర్క్యూలర్ జారీ చేసింది.ఇందులో భాగంగా మెడికల్ అడ్వాన్స్ కింద రూ.లక్ష పొందొచ్చని తెలియజేసింది. కరోనా వైరస్ సహా ఇతర వ్యాధుల కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చని తెలియజేశారు. ఈ మెడికల్ అడ్వాన్సు డబ్బులు కేవలం గంటలో ఖాతాదారుని అకౌంట్లో పడటంతో ఎంతో మంది లబ్ధిదారులకు ఈ విషయం ఊరటను కలిగిస్తోంది.

గతంలో కూడా ఈ విధమైనటువంటి సదుపాయాన్ని ఈపీఎఫ్‌వో  తన సబ్స్క్రైబర్లు లకు కల్పించింది. కాకపోతే దీనికి వ్యయ అంచనాలను చెల్లించాల్సి ఉండేది. ప్రస్తుతం దీనికోసం పీఎఫ్ ఖాతాదారులు ఎలాంటి వ్యయ అంచనాలను అందించాల్సిన పనిలేదని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now