టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ను అందిస్తోంది. జియోలో ఇప్పటి వరకు ఉన్న ప్లాన్లపై అందించే డేటాకు రోజు వారీ లిమిట్ను విధించారు. అంటే రోజుకు 1జీబీ, 1.5జీబీ, 2, 3 జీబీ చొప్పున మాత్రమే డేటాను ఉపయోగించుకునేందుకు వీలుండేది. డేటా లిమిట్ దాటితే మళ్లీ 24 గంటల పాటు వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే జియో అపరిమిత డేటా ప్లాన్స్ను ప్రకటించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
జియో ప్రకటించిన అపరిమిత డేటా ప్లాన్స్లో భాగంగా రూ.127తో రీచార్జి చేసుకుంటే 15 రోజుల వాలిడిటీతో 12 జీబీ డేటా వస్తుంది. 15 రోజుల్లోగా ఆ డేటాను ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే రూ.247 ప్లాన్తో 25జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్కు 30 రోజుల వాలిడిటీని నిర్ణయించారు. ఆలోగా 25 జీబీ డేటాను ఎప్పుడైనా వాడుకోవచ్చు. అలాగే రూ.447 నుంచి రూ.2,397 వరకు వివిధ రకాల అపరిమిత డేటా ప్లాన్స్ ను జియో ప్రవేశ పెట్టింది.
జియో ఈ ప్లాన్లను నో డెయిలీ లిమిట్ విభాగం కింద అందుబాటులో ఉంచింది. వీటిని ప్రీపెయిడ్ యూజర్లు రీచార్జి చేసుకోవచ్చు. రూ.447 ప్లాన్లో 50జీబీ డేటా వస్తుంది. దీన్ని 60 రోజుల్లోగా వాడుకోవచ్చు. ఇక ఈ ప్లాన్లన్నింటిలోనూ రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. జియో యాప్స్ను ఉచితంగా సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…