కరోనా బారిన పడిన వారికి చికిత్సను అందించేందుకు ఆనందయ్య మందును అందజేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వివాదం నెలకొన్నా హైకోర్టు తీర్పుతో మళ్లీ మందు పంపిణీ ప్రారంభమైంది. అయితే ఆనందయ్యకు అన్ని వర్గాల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. కానీ కొందరు మాత్రం ఆ మందుపై విమర్శలు చేస్తున్నారు. ఇక ప్రముఖ హేతువాది బాబు గోగినేని ఆనందయ్య మందును చట్నీగా వ్యాఖ్యానించారు. అయితే ఆనందయ్య మందుకు ప్రముఖ నటుడు జగపతి బాబు మద్దతుగా మాట్లాడడంతో బాబు గోగినేని జగపతి బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఎవడు నమ్మినా.. నమ్మకపోయినా.. నేను నమ్ముతున్నా.. అంటూ గతంలో జగపతి బాబు ఆనందయ్య మందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘ఆయుర్వేదం అనేది తప్పు చేయదు.. శరీరానికి హానిచేయదు. ప్రకృతి, భూదేవి తప్పు చేయవు. ప్రజల్ని కాపాడటానికి ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో మన ముందుకు వచ్చింది. ఈ ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నా.. ఆనందయ్యని దేవుడు ఆశీర్వదించాలి అంటూ.. జగపతి బాబు గతంలో కామెంట్ చేశారు. దానికి బాబు గోగినేని స్పందించారు.
‘అమ్మ నాటీ! తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా.. ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ.. కానీ తెలివైనవాడు ఎవడైనా కొంచెం ఆగి చెప్పేవాడు. ఈ ఆత్రం మనకే చేటు’ అంటూ జగపతి బాబుపై బాబు గోగినేని ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు.
అయితే ఇటీవలే జగపతిబాబుపై ఓ ఇంగ్లిష్ వెబ్సైట్లో వార్త వచ్చింది. ఆయన త్వరలో జూబ్లీహిల్స్లో ఓ ఆయుర్వేద హాస్పిటల్ను ఓపెన్ చేయబోతున్నారని అందులో ఉంది. ఈ నేపథ్యంలోనే జగపతి బాబు ఆనందయ్య మందుకు మద్దతును ప్రకటించారో, లేదో తెలియదు కానీ.. ఆయన ఆ మందు గురించి పాజిటివ్గా మాట్లాడడంతో బాబు గోగినేని విమర్శించారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…