మొబైల్స్ తయారీదారు షియోమీ కొత్తగా ఎంఐ నోట్ బుక్ ప్రొ, ఎంఐ నోట్బుక్ అల్ట్రా పేరిట రెండు నూతన ల్యాప్టాప్లను భారత్లో విడుదల చేసింది. వీటిల్లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంఐ నోట్ బుక్ ప్రొ ల్యాప్టాప్లో.. 14 ఇంచుల డిస్ప్లే ఉంది. దీనికి 2560 × 1600 పిక్సల్స్ రిజల్యూషన్ లభిస్తుంది. ఇంటెల్ 11వ జనరేషన్ కోర్ ఐ7, ఐ5 ప్రాసెసర్ ఆప్షన్లను ఇందులో అందిస్తున్నారు. 8/16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ, విండోస్ 10 హోమ్, హెచ్డీ వెబ్క్యామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సీ, డీటీఎస్ ఆడియో ఫీచర్లు లభిస్తున్నాయి. కేవలం 34 నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జింగ్ అవుతుంది. 11 గంటల వరకు వీడియోలను చూడవచ్చు.
ఎంఐ నోట్ బుక్ అల్ట్రా ల్యాప్టాప్లో.. 15.6 ఇంచుల డిస్ప్లే ఉంది. 3200 × 2000 పిక్సల్స్ రిజల్యూషన్ లభిస్తుంది. డిస్ప్లేకు 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అందువల్ల డిస్ప్లే క్వాలిటీగా ఉంటుంది. ఇంటెల్ 11వ జనరేషన్ కోర్ ఐ7, ఐ5 ప్రాసెసర్ ఆప్షన్లు లభిస్తున్నాయి. 8/16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ, విండోస్ 10 హోమ్, హెచ్డీ వెబ్ క్యామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సి, డీటీఎస్ ఆడియో ఫీచర్లు ఇందులో లభిస్తున్నాయి. కేవలం 45 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ అవుతుంది. 12 గంటల వరకు వీడియోలను చూడవచ్చు.
ఈ ల్యాప్టాప్లను ఎంఐ ఆన్లైన్ స్టోర్తోపాటు ఎంఐ హోమ్ స్టోర్స్, అమెజాన్, రిటెయిల్ స్టోర్స్ లో ఆగస్టు 31వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు. హెచ్డీఎఫ్సీ కార్డులతో రూ.4500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…