ఎక్కడైనా మృతదేహాన్ని పూడ్చడం లేదా దహనం చేస్తుంటారు. కానీ ఓ చోట మృతదేహాన్ని దారుణంగా తలకిందులుగా వేలాడదీశారు. ఇంతకీ అలా ఎందుకు చేశారంటే.. మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. జోగిపుర గ్రామానికి చెందిన భన్వర్ లాల్ బంజారా అనే వ్యక్తి నదిలో స్నానం చేయడానికి వెళ్లడంతో ప్రమాదవశాత్తూ మరణించాడు. దీంతో ఈ విషయం పోలీసులకు, అక్కడున్న గ్రామస్తులకు తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు.
కొందరు అతడి మృతదేహాన్ని బయటకు తీసి దాన్ని ఓ చెట్టుకు తలకిందులుగా వేలాడదీశారు. అలా చేయడం వల్ల నీరు బయటికి వస్తుందని దాంతో బతికే అవకాశం ఉండవచ్చని గ్రామస్తులు తెలియజేయడంతో అక్కడున్న పోలీసులు కూడా గ్రామస్థుల మాటలకు అడ్డు చెప్పలేకపోయారు. అలా 30 నిమిషాల పాటు మృతదేహాన్ని ఉంచి ఊపారు. ఎటువంటి ఫలితం లేకపోయే సరికి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కి తరలించారు.
ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా.. అక్కడున్న వారందరూ కోవిడ్ నిబంధనలు పాటించలేదని.. అక్కడున్న కొందరు పోలీసులు కూడా ఈ ఘటన పట్ల స్పందించకపోయేసరికి వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పోలీస్ అవుట్ పోస్ట్ ఇంచార్జ్ స్సందిస్తూ ఆ గ్రామస్తులు తాను ఎంత చెప్పినా వినలేదని.. అతడు బతుకుతాడని అలా చేశారని తెలిపారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…