8జీబీ ర్యామ్‌, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో శాంసంగ్ కొత్త 5జి ఫోన్‌..!

August 26, 2021 12:01 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శాంసంగ్‌.. గెలాక్సీ ఎం32 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. అందువ‌ల్ల ఈ ఫోన్‌లో 5జి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

8జీబీ ర్యామ్‌, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో శాంసంగ్ కొత్త 5జి ఫోన్‌..!

ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్ ల‌భిస్తుంది. వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను, 5 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాను, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు వైపు 13 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.

ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ల‌భిస్తుంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ప‌క్క వైపున ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. దీని ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తుంది. 128 జీబీ స్టోరేజ్, డ్యుయ‌ల్ సిమ్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి ఫీచ‌ర్ల‌ను ఇందులో అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జి ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్ మోడ‌ల్ ధ‌ర రూ.20,999 ఉండ‌గా, 8జీబీ ర్యామ్ మోడ‌ల్ ధ‌ర రూ.22,999గా ఉంది. ఈ ఫోన్‌ల‌ను అమెజాన్‌తోపాటు శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో, అన్ని ఆఫ్ లైన్ స్టోర్స్‌లో విక్ర‌యిస్తున్నారు. ఐసీఐసీఐ కార్డుల‌తో రూ.2000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now