మొబైల్స్ తయారీదారు ఒప్పో.. ఎఫ్19 పేరిట భారత్లో ఓ నూతన స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన సూపర్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఈ ఫోన్లో ఏర్పాటు చేశారు. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఇందులో లభిస్తుంది. వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ కేవలం 72 నిమిషాల్లోనే పూర్తిగా చార్జింగ్ అవుతుంది.
ఒప్పో ఎఫ్19 స్మార్ట్ ఫోన్ ప్రిజమ్ బ్లాక్, మిడ్నైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.18,990గా ఉంది. దీన్ని ఫ్లిప్కార్ట్, అమెజాన్తోపాటు ఇతర ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్స్లో ఏప్రిల్ 9వ తేదీ నుంచి విక్రయించనున్నారు. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్, స్టాండర్డ్ చార్టర్డ్ కార్డులపై ఫ్లాట్ 7.5 శాతం క్యాష్బ్యాక్ను అందిస్తారు. ఎంపిక చేసిన కార్డులతో జీరో డౌన్ పేమెంట్తో ఈ ఫోన్ను కొనవచ్చు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…