వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్ట్రానిక్ హైదరాబాద్లోని నానక్ రాం గూడలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కేంద్రాన్ని ఈరోజు తెలంగాణ ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు.బీఎస్ఆర్ టెక్పార్క్లో సుమారు రూ.1,200 కోట్లతో దీన్ని ఏర్పాటు చేశారు. హెల్త్కేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసిన యువతకు ఇందులో ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రస్తుతం ఈ కంపెనీ లో వెయ్యి మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించగా భవిష్యత్తులో మరో 4 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అమెరికాకు చెందిన ఈ సంస్థ ప్రపంచ స్థాయిలో వైద్య పరికరాల ఇంజనీరింగ్ ఆవిష్కరణ రంగంలో కృషి చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ కంపెనీలో దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు.
2016 లో మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు మెడ్ట్రానిక్ కార్యనిర్వాహక చైర్మన్ ఒమర్ ఇస్రాక్తో చర్చలు జరిపారు. అనంతరం ఆ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నానక్ రాం గూడలో తమ సంస్థ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించి ప్రస్తుతం ఆ పనులను పూర్తి చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…