వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్ట్రానిక్ హైదరాబాద్లోని నానక్ రాం గూడలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కేంద్రాన్ని ఈరోజు తెలంగాణ ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు.బీఎస్ఆర్ టెక్పార్క్లో సుమారు రూ.1,200 కోట్లతో దీన్ని ఏర్పాటు చేశారు. హెల్త్కేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసిన యువతకు ఇందులో ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రస్తుతం ఈ కంపెనీ లో వెయ్యి మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించగా భవిష్యత్తులో మరో 4 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అమెరికాకు చెందిన ఈ సంస్థ ప్రపంచ స్థాయిలో వైద్య పరికరాల ఇంజనీరింగ్ ఆవిష్కరణ రంగంలో కృషి చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ కంపెనీలో దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు.
2016 లో మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు మెడ్ట్రానిక్ కార్యనిర్వాహక చైర్మన్ ఒమర్ ఇస్రాక్తో చర్చలు జరిపారు. అనంతరం ఆ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నానక్ రాం గూడలో తమ సంస్థ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించి ప్రస్తుతం ఆ పనులను పూర్తి చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…