వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్ట్రానిక్ హైదరాబాద్లోని నానక్ రాం గూడలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కేంద్రాన్ని ఈరోజు తెలంగాణ ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు.బీఎస్ఆర్ టెక్పార్క్లో సుమారు రూ.1,200 కోట్లతో దీన్ని ఏర్పాటు చేశారు. హెల్త్కేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసిన యువతకు ఇందులో ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రస్తుతం ఈ కంపెనీ లో వెయ్యి మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించగా భవిష్యత్తులో మరో 4 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అమెరికాకు చెందిన ఈ సంస్థ ప్రపంచ స్థాయిలో వైద్య పరికరాల ఇంజనీరింగ్ ఆవిష్కరణ రంగంలో కృషి చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ కంపెనీలో దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు.
2016 లో మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు మెడ్ట్రానిక్ కార్యనిర్వాహక చైర్మన్ ఒమర్ ఇస్రాక్తో చర్చలు జరిపారు. అనంతరం ఆ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నానక్ రాం గూడలో తమ సంస్థ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించి ప్రస్తుతం ఆ పనులను పూర్తి చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…