స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు డెబిట్ కార్డు పరంగా సురక్షితమైన సదుపాయాలను అందిస్తుందని చెప్పవచ్చు. డెబిట్ కార్డులను వాడే అనేక చోట్ల పిన్ను ఎంటర్ చేయాలి. దీంతో ఖాతాదారుల అకౌంట్లకు రక్షణ లభిస్తుంది. అయితే పిన్ నంబర్ను మర్చిపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. వెంటనే సులభంగా జనరేట్ చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే…
ఎస్బీఐ డెబిట్ కార్డు పిన్ను ఎస్ఎంఎస్ ద్వారా జనరేట్ చేయవచ్చు. అందుకు ఇలా చేయాలి. PIN అని టైప్ చేసి డెబిట్ కార్డు చివరి 4 అంకెలను ఎంటర్ చేయాలి. మళ్లీ స్పేస్ ఇచ్చి మీ ఎస్బీఐ అకౌంట్ నంబర్లో చివరి నాలుగు అంకెలను ఎంటర్ చేయాలి. అంటే PIN (XXXX) (YYYY) అని మెసేజ్ టైప్ చేయాలి. XXXX అనేది డెబిట్ కార్డు చివరి నాలుగు అంకెలు. YYYY అనేది అకౌంట్ నంబర్ చివరి నాలుగు అంకెలు. తరువాత ఆ మెసేజ్ను 567676కు పంపించాలి. దీంతో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎస్బీఐ ఏటీఎంలో 2 రోజుల్లోగా ఉపయోగించాలి. అక్కడ ఈ ఓటీపీ ద్వారా కొత్త పిన్ను జనరేట్ చేయవచ్చు.
1800 112 211, 1800 425 3800, 080-26599990 లలో ఏదైనా నంబర్కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి కాల్ చేయాలి. తరువాత ఐవీఆర్ఎస్ వినిపిస్తుంది. అందులో 2 నంబర్ను ప్రెస్ చేయాలి. దీంతో ఏటీఎం, డెబిట్ కార్డుల సర్వీస్కు ఐవీఆర్ఎస్ వెళ్తుంది. అక్కడ ఎస్బీఐ ఏటీఎం పిన్ను జనరేట్ చేసేందుకు 1 నొక్కాలి. మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి కాల్ చేయకపోతే 2 నొక్కాలి. తరువాత ఏటీఎం కార్డు చివరి 5 అంకెలను అడుగుతుంది. అవి ఎంటర్ చేశాక నిర్దారించేందుకు 1 నొక్కాలి. అనంతరం 2 నొక్కాలి. మళ్లీ ఏటీఎం కార్డు చివరి 5 అంకెలను ఎంటర్ చేయాలి. అనంతరం అకౌంట్ నంబర్లో చివరి 5 అంకెలను ఎంటర్ చేసి 1 నొక్కాలి. తరువాత 2 నొక్కి అవే అంకెలను మళ్లీ ఎంటర్ చేయాలి. తరువాత పుట్టిన తేదీ అడుగుతుంది. ఎంటర్ చేయాలి. ఈ క్రమంలో ఎస్బీఐ డెబిట్ కార్డు పిన్ విజయవంతంగా జనరేట్ అవుతుంది. ఆ వివరాలు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వస్తాయి. 24 గంటల్లోగా సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంను సందర్శించి అక్కడ ఆ పిన్ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా కొత్త పిన్ను జనరేట్ చేయవచ్చు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…