ఏసర్ కంపెనీ మన దేశంలో మొట్టమొదటి సారిగా జీ ల్యాప్ టాప్ లను లాంచ్ చేసింది. అదే ఏసర్ స్పిన్7 ల్యాప్ టాప్. ఇందులో 14 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో పాటు 360 డిగ్రీల కోణంలో ఈ డిస్ ప్లే తిరగనుంది. ఈ సందర్భంగా ఏసర్ కంపెనీ వ్యవస్థాపకులు మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా 5 జీ ల్యాప్ టాప్ ఇదేనని ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8సీఎక్స్ జెన్ 2 5జీ ప్లాట్ఫాంను అందించారు.
ఏసర్ స్పిన్ 7 ధర మనదేశంలో .1,34,999గా ఉంది. ఈ అధునాతన ల్యాప్ టాప్ లు ఏసర్ ఎక్స్క్లూజివ్ స్టోర్లు, ఏసర్ ఆన్ లైన్ స్టోర్, ఇతర భాగస్వామ్య స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో స్టీమ్ బ్లూ రంగు అందుబాటులో ఉంది. ఈ ఒక్క కలర్ వేరియంట్ ను మాత్రమే కంపెనీ లాంచ్ చేసింది.
ఈ 5 జీ ల్యాప్ టాప్ లో 4జీ, వైఫై 6, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 56WHR బ్యాటరీని అమర్చారు.ఏసర్ స్పిన్ 7 టచ్ జెస్చర్లను కూడా సపోర్ట్ చేయనుంది. దీని మందం 1.59 సెంటీమీటర్లుగానూ, బరువు 1.4 కేజీలుగానూ ఉంది. అదేవిధంగా ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అందుబాటులో ఉంది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…