తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పది పరీక్షలను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా 1-9 తరగతుల విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు లేకుండా వారిని పాస్ చేస్తూ పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు.
ఆదివారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ ఆదేశాలను జారీ చేసినట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది పరీక్షలు లేకుండా 1నుంచి 9వ తరగతి చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు.
పాఠశాలలు జూనియర్ కళాశాలలో ఎప్పుడు తెరిచేది అనే విషయం గురించి కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జూన్ 1వ తేదీన ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఈ ఏడాదికి ఏప్రిల్ 26న విద్యా సంవత్సరం చివరి దినంగా ప్రకటిస్తూ ఏప్రిల్ 26 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…