భయం ఎంతో ధైర్యవంతులని కూడా కృంగదీస్తుంది. భయం ప్రాణాలను కూడా తీస్తుంది. అటువంటి భయమే 30 ఏళ్ల యువకుడు ప్రాణాలను బలిగొంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్లం గ్రామానికి చెందిన 30 ఏళ్ల యువకుడు అశోక్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ గా పని చేసేవాడు.అయితే గత కొద్దిరోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అశోక్ అతనికి కరోనా వచ్చిందేమోనని భయపడ్డాడు.దీంతో తల్లి గంగామని, భార్య లక్ష్మి, తమ్ముడు గంగాధర్ తో కలిసి రెంజల్ పీహెచ్సీకి వచ్చి పరీక్ష చేయించుకున్నాడు.
పరీక్షల అనంతరం ఆస్పత్రి ఆవరణలో చెట్టు కింద సేద తీరుతున్నారు. ఈ క్రమంలోనే అశోక్ తనకెంతో నీరసంగా ఉందని తన తల్లితో చెప్పడంతో తన తల్లి అతనికి ఏం కాదు ధైర్యంగా ఉండు అంటూ ధైర్యం నూరిపోసింది. ఇంతలోనే అశోక్ ఉన్నఫలంగా తన తల్లి గంగామణి వడిలో కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఒక్కసారిగా తన కొడుకు ప్రాణాలు వదలడంతో ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం. మృతుడికి భార్య కొడుకు ఉన్నారు.
ఈ సంఘటన జరిగిన కొద్ది సమయానికి ఆసుపత్రి సిబ్బంది తనకు కరోనా నెగిటివ్ అనే వార్త తెలియజేశారు. ఈ విషయం తెలిసి మృతుడి భార్య, తల్లి మరింత ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కరోనా పట్ల ఉన్న భయం, అపోహలు కారణంగానే ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయని. ఇకపై ఈ వ్యాధి పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు సూచిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…