BSNL Rs 997 Prepaid Plan : ప్రైవేటు టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ లు మొబైల్ చార్జిలను విపరీతంగా పెంచడంతో సామాన్య ప్రజలు చాలా మంది ఇప్పటికే BSNLలోకి మారిపోయారు. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. చాలా చోట్ల BSNL సిమ్ల కోసం ప్రజలు క్యూలు కడుతున్నారు. ఇక త్వరలోనే BSNLలో 4జితోపాటు 5జి కూడా వస్తుందని చెబుతుండడంతో ఈ సిమ్లను తీసుకునేందుకు ప్రజలు ఆసక్తిని చూపిస్తున్నారు. BSNLలో ఇతర కంపెనీలతో పోలిస్తే చాలా తక్కువ ధరలకే రీచార్జి ప్లాన్లు అందుబాటులో ఉండడం విశేషం.
BSNLలో ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.997తో రీచార్జి చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 160 రోజులు కాగా ఇదేలాంటి ప్లాన్ను ఇతర కంపెనీలు అయితే కేవలం 84 రోజుల వాలిడిటీతోనే అందిస్తున్నాయి. ఇక BSNL అందిస్తున్న రూ.997 ప్లాన్లో కస్టమర్లకు 160 రోజుల వాలిడిటీతోపాటు రోజుకు 2జీబీ చొప్పున డేటా లభిస్తుంది. అలాగే 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా వస్తాయి. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
ఇతర నెట్వర్క్లలో ఇదే ప్లాన్ ద్వారా కేవలం 84 రోజుల వాలిడిటీని మాత్రమే పొందవచ్చు. కానీ BSNL ద్వారా మాత్రం దాదాపుగా అంతకు రెట్టింపు మొత్తంలో వాలిడిటీ లభిస్తుంది. అందువల్లే చాలా మంది BSNLకు మారిపోతున్నారు. ఇక ఇప్పుడు చాలా చోట్ల రహదారుల పక్కన కూడా స్టాండ్లలో BSNL సిమ్లను విక్రయిస్తుండగా.. అవన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే BSNL సిమ్ను మొదటిసారి పొందే ప్రీపెయిడ్ కస్టమర్లు ముందుగా రూ.249 చెల్లించాల్సి ఉంటుంది. కానీ సిమ్ ఫ్రీగా ఇస్తారు. ఈ ప్లాన్ వాలిడిటీ నెల రోజుల వరకు ఉంటుంది. సిమ్ తీసుకున్న వెంటనే 4 నుంచి 24 గంటల్లోగా యాక్టివేట్ కూడా అవుతుంది. ఎలాంటి వెరిఫికేషన్ కాల్ కూడా చేయాల్సిన పనిలేదు. ఆధార్ బయోమెట్రిక్తో సిమ్ పొందవచ్చు.
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…