Fake Garlic : ప్రస్తుత తరుణంలో మార్కెట్లో వస్తున్న వస్తువుల్లో ఏది అసలుదో, ఏది నకిలీదో గుర్తించడం అత్యంత కష్టంగా మారింది. చాలా మంది వస్తువులకు నకిలీలను తయారు చేస్తున్నారు. అలాగే ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. కల్తీ అవుతున్న ఆహారాలను తింటున్న ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. కల్తీలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నప్పటికీ అక్రమార్కులు మాత్రం కొత్త దారులను వెతుకుతూనే ఉన్నారు. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మార్కెట్లో నకిలీ వెల్లుల్లి కలకలం రేపుతోంది.
ఇప్పటికే మార్కెట్లో అనేక రకాల ఆహారాలను కల్తీ చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో వెల్లుల్లి కూడా చేరింది. తాజాగా మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో నకిలీ వెల్లుల్లి బాగోతం బయట పడింది. ఓ చోట వెల్లుల్లిని కొనుగోలు చేసిన కస్టమర్ దాన్ని తెరిచి చూడగా మొత్తం అందులో సిమెంట్ కనబడింది. దాన్ని అతను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్గా మారింది. దీంతో నకిలీ వెల్లుల్లిని చూసిన నెటిజన్లు ఖంగు తింటున్నారు. వెల్లుల్లిని ఇలా కూడా కల్తీ చేస్తారా.. అని షాకవుతున్నారు.
అయితే వీటిని ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడ ఎలా తయారవుతున్నాయి.. అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కానీ మార్కెట్లో హల్చల్ చేస్తున్న ఈ నకిలీ వెల్లుల్లిని చూసి ప్రజలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలే వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఈ నకిలీ వెల్లుల్లి నుంచి ఎలా బయట పడాలి.. అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మీరు కూడా వెల్లుల్లిని కొంటే ఎందుకైనా మంచిది ఒక్కసారి ఓపెన్ చేసి చూశాకే కొనండి. లేదంటే మోసపోతారు.
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…