Fake Garlic : ప్రస్తుత తరుణంలో మార్కెట్లో వస్తున్న వస్తువుల్లో ఏది అసలుదో, ఏది నకిలీదో గుర్తించడం అత్యంత కష్టంగా మారింది. చాలా మంది వస్తువులకు నకిలీలను తయారు చేస్తున్నారు. అలాగే ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. కల్తీ అవుతున్న ఆహారాలను తింటున్న ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. కల్తీలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నప్పటికీ అక్రమార్కులు మాత్రం కొత్త దారులను వెతుకుతూనే ఉన్నారు. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మార్కెట్లో నకిలీ వెల్లుల్లి కలకలం రేపుతోంది.
ఇప్పటికే మార్కెట్లో అనేక రకాల ఆహారాలను కల్తీ చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో వెల్లుల్లి కూడా చేరింది. తాజాగా మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో నకిలీ వెల్లుల్లి బాగోతం బయట పడింది. ఓ చోట వెల్లుల్లిని కొనుగోలు చేసిన కస్టమర్ దాన్ని తెరిచి చూడగా మొత్తం అందులో సిమెంట్ కనబడింది. దాన్ని అతను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్గా మారింది. దీంతో నకిలీ వెల్లుల్లిని చూసిన నెటిజన్లు ఖంగు తింటున్నారు. వెల్లుల్లిని ఇలా కూడా కల్తీ చేస్తారా.. అని షాకవుతున్నారు.
అయితే వీటిని ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడ ఎలా తయారవుతున్నాయి.. అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కానీ మార్కెట్లో హల్చల్ చేస్తున్న ఈ నకిలీ వెల్లుల్లిని చూసి ప్రజలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలే వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఈ నకిలీ వెల్లుల్లి నుంచి ఎలా బయట పడాలి.. అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మీరు కూడా వెల్లుల్లిని కొంటే ఎందుకైనా మంచిది ఒక్కసారి ఓపెన్ చేసి చూశాకే కొనండి. లేదంటే మోసపోతారు.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…