విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. మార్చి 13, 2026 నుంచి ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ చేయనున్నారు. ఈ సినిమా గత ఫిబ్రవరి నెలలో 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ను మూటగట్టుకుంది. చిత్రం థియేటర్లలో రిలీజ్ అయిన సరిగ్గా నెల రోజులకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఫంకీ చిత్రానికి కేవీ అనుదీప్ దర్శకత్వం వహించగా ఇందులో నరేష్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో పలువురు నిర్మాతలు, దర్శకులు సైతం అతిథి పాత్రల్లో యాక్ట్ చేసి మెప్పించారు. ఇక ఈ చిత్ర కథ వివరాలు ఇలా ఉన్నాయి.
కోమల్ (విశ్వక్ సేన్) సినిమా రంగానికి కొత్త. ఏదైనా ఒక సినిమాకు దర్శకత్వం వహించి విజయం సాధించాలని చూస్తుంటాడు. మంచి ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థలో కోమల్ కు అవకాశం వస్తుంది. దీంతో రూ.4 కోట్లలోనే సినిమా పూర్తి చేస్తానని దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఫంకీ అనే సినిమాను ప్రారంభిస్తాడు. అయితే రాను రాను ఆ సినిమా బడ్జెట్ రూ.40 కోట్లకు చేరుతుంది. చాలా కాలం అవుతుంది. అయినా సినిమా పూర్తి కాదు, దీంతో మంచి ప్రొడక్షన్స్ నిర్మాత (నరేష్) ఒత్తిడికి గురై హాస్పిటల్లో చేరతాడు. అయితే ఆ విషయం తెలుసుకున్న నిర్మాత కుమార్తె చిత్ర (కయాదు లోహర్) ఆ సినిమా బాధ్యతను నెత్తిన వేసుకుంటుంది. బడ్జెట్ పెరగకుండా దర్శకుడితో మూవీ పూర్తి చేస్తానని ఆమె ఎంట్రీ ఇస్తుంది. అయితే చిత్ర ఆ బడ్జెట్లోనే కోమల్తో సినిమాను పూర్తి చేసిందా.. అసలు చివరకు ఏం జరిగింది.. అన్న వివరాలను తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.
ఇందులో ఈశ్వరీరావు, సంపత్ రాజ్, దిల్ రాజు, హరీష్ శంకర్, అనుదీప్ కేవీ, కల్యాణ్ శంకర్ నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సితార ఎంటర్టెయిన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కించారు. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ బాధ్యతలను చేపట్టగా, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ సంగీతం అందించారు.
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొంండ, రష్మిక మందన్న వివాహం చేసుకున్న నేపథ్యంలో ఓ చిన్నారి సోషల్ మీడియాలో వారిని ఓ…
తన విడాకుల విషయం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎవరూ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తమిళనాడు…
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మార్చి 8, 2026న జరగనున్న భారత్, న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్…
నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య సంగీత చెంగల్ పట్టు జిల్లా కోర్టులో మరో కొత్త పిటిషన్ దాఖలు…
నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు.…
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ…
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత…