అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. ఈ మధ్య కాలంలో కోహ్లిపై అనేక పుకార్లు వచ్చిన విషయం విదితమే. అయితే వాటిని కొట్టి పారేశారు. కానీ చివరకు వాటినే నిజం చేశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా ఎన్నో ఏళ్ల నుంచి సేవలను అందిస్తున్నానని, సుదీర్ఘ చర్చల అనంతరం తాను టీ20 జట్టుకు కెప్టెన్గా తప్పుకుంటున్నానని కోహ్లి ప్రకటించాడు. ఈ మేరకు కోహ్లి తన సోషల్ ఖాతాల్లో ఈ ప్రకటన చేశాడు. అయితే టీ20లలో బ్యాట్స్మన్గా కొనసాగుతానని తెలిపాడు. ఈ నిర్ణయాన్ని బీసీసీఐ సెక్రెటరీ జై షా, అధ్యక్షుడు సౌరవ్ గంగూలీలకు తెలిపానని అన్నాడు.
అయితే ఇటీవలే కోహ్లి గురించి పలు వార్తలు పుకార్లు షికార్లు చేశాయి. అతను త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ అనంతరం వన్డే, టీ20లకు కెప్టెన్గా తప్పుకుంటాడని వార్తలు వచ్చాయి. కానీ బీసీసీఐ వర్గాలు ఖండించాయి. అయితే ఆశ్చర్యంగా కోహ్లి అదే వార్తలను నిజం చేశాడు. వన్డేల సంగతి చెప్పలేదు కానీ, టీ20 వరల్డ్ కప్ అనంతరం టీ20లకు కెప్టెన్గా తప్పుకుంటానని మాత్రం ప్రకటించాడు. ఈ క్రమంలో టీ20లకు భారత్ కు రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక కోహ్లి వన్డేలు, టెస్టులకు మాత్రమే కెప్టెన్గా కొనసాగనున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…