ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ చాలా మంది మూఢనమ్మకాలను ఇప్పటికీ నమ్ముతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా కొందరు రెండు తలల పాము ఇంట్లో ఉంటే అదృష్టమని, అలాంటి వారికి గుప్త నిధులు దొరుకుతాయని ఓ ముఠా తమ వద్ద ఉన్న ఓ రెండు తలల పామును అమ్మకానికి పెట్టారు.
అయితే విషయం తెలిసిన విజిలెన్స్ అధికారులు డీఎఫ్ఓ సుధాకర్రెడ్డి నేతృత్వంలో దాడిచేసి.. ఈసీఐఎల్ సమీపంలోని నగరంలో ఉన్న సగ్గుర్తి రోహిత్, జాలిగ శ్రీధర్, రాయుడు వెంకటరమణ, వి.ఆంజనేయప్రసాద్ అనే ముఠా గ్యాంగ్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెండు తలలు కలిగి 4.30 కేజీల బరువు ఉన్న ఈ పామును ఏకంగా రూ.70 లక్షలకు అమ్మకానికి పెట్టారు.
కాగా నిందితుల నుంచి పోలీసులు కారు, టూవీలర్, 4 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా రెండు తలలు కలిగిన పామును “రెడ్ సాండ్ బోవా” అంటారని దీనిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రమాదం తప్ప ఏ విధమైన అదృష్టం కలగదని అధికారులు తెలియజేశారు. ఈ విధంగా పామును అమ్మకానికి పెట్టిన ముఠాను అరెస్టు చేయడంతో అధికారులను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి శోభ అభినందించారు. కేవలం మూఢ నమ్మకాలను నమ్మే అమాయకులను గుర్తించి కొందరు ఈ విధమైన మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…