ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ చాలా మంది మూఢనమ్మకాలను ఇప్పటికీ నమ్ముతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా కొందరు రెండు తలల పాము ఇంట్లో ఉంటే అదృష్టమని, అలాంటి వారికి గుప్త నిధులు దొరుకుతాయని ఓ ముఠా తమ వద్ద ఉన్న ఓ రెండు తలల పామును అమ్మకానికి పెట్టారు.
అయితే విషయం తెలిసిన విజిలెన్స్ అధికారులు డీఎఫ్ఓ సుధాకర్రెడ్డి నేతృత్వంలో దాడిచేసి.. ఈసీఐఎల్ సమీపంలోని నగరంలో ఉన్న సగ్గుర్తి రోహిత్, జాలిగ శ్రీధర్, రాయుడు వెంకటరమణ, వి.ఆంజనేయప్రసాద్ అనే ముఠా గ్యాంగ్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెండు తలలు కలిగి 4.30 కేజీల బరువు ఉన్న ఈ పామును ఏకంగా రూ.70 లక్షలకు అమ్మకానికి పెట్టారు.
కాగా నిందితుల నుంచి పోలీసులు కారు, టూవీలర్, 4 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా రెండు తలలు కలిగిన పామును “రెడ్ సాండ్ బోవా” అంటారని దీనిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రమాదం తప్ప ఏ విధమైన అదృష్టం కలగదని అధికారులు తెలియజేశారు. ఈ విధంగా పామును అమ్మకానికి పెట్టిన ముఠాను అరెస్టు చేయడంతో అధికారులను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి శోభ అభినందించారు. కేవలం మూఢ నమ్మకాలను నమ్మే అమాయకులను గుర్తించి కొందరు ఈ విధమైన మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…