బీహార్కు చెందిన ఓ వ్యక్తి ఖాతాలో ఇటీవలే ఉత్తర్ బీహార్ గ్రామీణ్ బ్యాంక్ వారు పొరపాటున రూ.5.50 లక్షలను జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటన మరువక ముందే మళ్లీ అలాంటి ఘటనే ఒకటి అదే బ్యాంకులో చోటు చేసుకుంది. ఈసారి ఏకంగా ఇద్దరు పిల్లల ఖాతాల్లో రూ.96 కోట్లు జమ అయ్యాయి. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. సంఘటనపై విచారణ చేపట్టారు.
బీహార్లోని కతిహార్ జిల్లాలో ఉన్న బగహురా పంచాయతీ పరిధిలోని పస్తియా అనే గ్రామానికి చెందిన ఆశిష్ కుమార్, గురుచరణ్ బిశ్వాస్ అనే ఇద్దరు విద్యార్థులు 6వ తరగతి చదువుతున్నారు. వారికి ఉత్తర్ బీహార్ గ్రామీణ్ బ్యాంక్లో ఖాతాలు ఉన్నాయి. అయితే వారి ఖాతాల్లో కోట్ల రూపాయల డబ్బు జమ అయింది.
ఆశిష్ ఖాతాలో రూ.6,20,11,100 జమ కాగా, గురుచరణ్ ఖాతాలో రూ.900,52,21,223 జమ అయ్యాయి. దీంతో వెంటనే పొరపాటును గ్రహించిన బ్యాంకు అధికారులు డబ్బును విత్డ్రా చేయకుండా అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. డబ్బులు ఎలా జమ అయ్యాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ బ్యాంకులో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…