బీహార్కు చెందిన ఓ వ్యక్తి ఖాతాలో ఇటీవలే ఉత్తర్ బీహార్ గ్రామీణ్ బ్యాంక్ వారు పొరపాటున రూ.5.50 లక్షలను జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటన మరువక ముందే మళ్లీ అలాంటి ఘటనే ఒకటి అదే బ్యాంకులో చోటు చేసుకుంది. ఈసారి ఏకంగా ఇద్దరు పిల్లల ఖాతాల్లో రూ.96 కోట్లు జమ అయ్యాయి. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. సంఘటనపై విచారణ చేపట్టారు.
బీహార్లోని కతిహార్ జిల్లాలో ఉన్న బగహురా పంచాయతీ పరిధిలోని పస్తియా అనే గ్రామానికి చెందిన ఆశిష్ కుమార్, గురుచరణ్ బిశ్వాస్ అనే ఇద్దరు విద్యార్థులు 6వ తరగతి చదువుతున్నారు. వారికి ఉత్తర్ బీహార్ గ్రామీణ్ బ్యాంక్లో ఖాతాలు ఉన్నాయి. అయితే వారి ఖాతాల్లో కోట్ల రూపాయల డబ్బు జమ అయింది.
ఆశిష్ ఖాతాలో రూ.6,20,11,100 జమ కాగా, గురుచరణ్ ఖాతాలో రూ.900,52,21,223 జమ అయ్యాయి. దీంతో వెంటనే పొరపాటును గ్రహించిన బ్యాంకు అధికారులు డబ్బును విత్డ్రా చేయకుండా అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. డబ్బులు ఎలా జమ అయ్యాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ బ్యాంకులో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…