వర్షం పడినప్పుడు మనం బయట ఉంటే మన ఫోన్లు, ఇతర వస్తువులు తడవకుండా మనం వాటిని కవర్లలో పెట్టుకుంటాం. అయితే కవర్లను మనం అన్ని సందర్భాల్లోనూ వెంట తీసుకెళ్లలేం కదా. దీంతో ఫోన్లు వర్షానికి తడిచిపోతుంటాయి. వాటర్ రెసిస్టెన్స్ ఉంటే ఏమీ కాదు. ఆ ఫీచర్ లేకపోతే.. ఫోన్ వర్షంలో తడిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఫోన్ను రిపేర్ కోసం సర్వీస్ సెంటర్లో ఇవ్వాల్సి ఉంటుంది.
అలా ఫోన్ను రిపేర్ కోసం ఇస్తే అందుకు అయ్యే ఖర్చులను భరించాలి. ఈ విధంగా వర్షంలో తడిచిన ఫోన్లతో అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కింద చెప్పబోయే సూచన పాటిస్తే దాంతో ఇకపై వర్షంలో ఎప్పుడు తడవాల్సి వచ్చినా మీరు తడుస్తారు.. కానీ ఫోన్ తడవదు. అందుకు ఏం చేయాలంటే..
సాధారణంగా మనం ఫోన్లను కొన్నప్పుడు వాటితోపాటు కవర్లను ఇస్తుంటారు. ఫోన్ను వాటిలో ఉంచి ప్యాక్ చేస్తారు. మనం బాక్స్ ను ఓపెన్ చేసి తీయగానే ఫోన్ కవర్లో ఉంటుంది. అయితే ఆ కవర్ను పారేయకండి. దాన్ని అలాగే దాచి పెట్టుకోండి.
ఫోన్కు చెందిన బ్యాక్ కేస్ లో వెనుక వైపు ఆ కవర్ను ఉంచి ఫోన్కు బ్యాక్ కేస్ ఫిక్స్ చేయండి. దీంతో ఆ కేస్లో కవర్ అలాగే ఉంటుంది. ఫోన్ ఆ కవర్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. ఈ క్రమంలో మీరు ఎప్పుడైనా బయట ఉన్నప్పుడు వర్షం పడితే అప్పుడు ఆ కవర్ను బయటకు తీసి అందులో ఫోన్ను ఉంచి సీల్ వేసేయండి. ఫోన్ తడవకుండా ఉంటుంది. తరువాత ఆ కవర్ను తడి పోయేలా ఆరబెట్టండి. దీంతో కవర్ పొడిగా మారుతుంది. మళ్లీ దాన్ని బ్యాక్ కేస్ లో పెట్టుకోండి. ఈ విధంగా ఆ కవర్ను ఉపయోగించడం వల్ల వర్షంలో ఉన్నా కూడా ఫోన్ను తడవకుండా చూసుకోవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…