హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల చిన్నారి చైత్రపై రాజు అనే యువకుడు అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ తీవ్రంగా కలకలం రేపింది. ఈ క్రమంలోనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అతనిని ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అతడి ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల రూపాయల నజరానా ప్రకటించారు.
గత వారం రోజుల నుంచి పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న రాజు ఎట్టకేలకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ సంఘటన సంచలనం కలిగిస్తోంది. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తమ కొడుకును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా చిన్నారి చైత్రకు న్యాయం జరగాలంటూ పలువురు సినీ సెలబ్రిటీలు స్పందించి చైత్ర మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇక ప్రస్తుతం రాజు మృతి చెందాడు అనే విషయం తెలియడంతో అతని మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో చిరు స్పందిస్తూ.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడు తనకు తానే శిక్షించుకోవడంతో బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరట కలిగింది. ఈ సంఘటనపై ప్రజలు, మీడియా పెద్ద ఎత్తున స్పందించాయి. ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ప్రభుత్వంతోపాటు పౌర సమాజం చొరవ చూపాలి. అలాంటి వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని, ఆ చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ.. మెగాస్టార్ ట్వీట్ చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…