హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల చిన్నారి చైత్రపై రాజు అనే యువకుడు అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ తీవ్రంగా కలకలం రేపింది. ఈ క్రమంలోనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అతనిని ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అతడి ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల రూపాయల నజరానా ప్రకటించారు.
గత వారం రోజుల నుంచి పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న రాజు ఎట్టకేలకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ సంఘటన సంచలనం కలిగిస్తోంది. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తమ కొడుకును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా చిన్నారి చైత్రకు న్యాయం జరగాలంటూ పలువురు సినీ సెలబ్రిటీలు స్పందించి చైత్ర మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇక ప్రస్తుతం రాజు మృతి చెందాడు అనే విషయం తెలియడంతో అతని మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో చిరు స్పందిస్తూ.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడు తనకు తానే శిక్షించుకోవడంతో బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరట కలిగింది. ఈ సంఘటనపై ప్రజలు, మీడియా పెద్ద ఎత్తున స్పందించాయి. ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ప్రభుత్వంతోపాటు పౌర సమాజం చొరవ చూపాలి. అలాంటి వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని, ఆ చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ.. మెగాస్టార్ ట్వీట్ చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…