ఐపీఎల్ 2021: ముంబైపై సునాయాసంగా నెగ్గిన పంజాబ్‌..

April 24, 2021 12:13 AM

చెన్నైలో జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 టోర్నీ 17వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజ‌యం సాధించింది. ముంబై నిర్దేశించిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని పంజాబ్ సునాయాసంగా ఛేదించింది. ముంబైని పంజాబ్ త‌క్కువ స్కోరుకే క‌ట్ట‌డి చేసింది. దీంతో పంజాబ్ స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని సుల‌భంగా ఛేదించ‌గ‌లిగింది. ముంబైపై పంజాబ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

punjab won by 9 wickets against mumbai in ipl 2021 17th match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా ముంబై బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 131 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ముంబై బ్యాట్స్‌మెన్ల‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, సూర్య కుమార్ యాద‌వ్‌లు మాత్ర‌మే రాణించారు. 52 బంతులు ఆడిన రోహిత్ 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 63 ప‌రుగులు చేయ‌గా, 27 బంతుల్లో యాద‌వ్ 3 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 33 ప‌రుగులు చేశాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, ర‌వి బిష్ణోయ్‌లు చెరో 2 వికెట్లు తీశారు. దీప‌క్ హుడా, అర్ష‌దీప్ సింగ్‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన పంజాబ్ 17.4 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. 1 వికెట్ మాత్ర‌మే న‌ష్ట‌పోయి 132 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్ల‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్‌, క్రిస్ గేల్‌లు రాణించారు. 52 బంతుల్లో రాహుల్ 3 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 60 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా, గేల్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల‌తో 43 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముంబై బౌల‌ర్ల‌లో రాహుల్ చాహ‌ర్‌కు 1 వికెట్ ద‌క్కింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment